కర్ణాటకలో ఘోర ప్రమాదం: రెండు కార్లు ఢీ 12 మంది మృతి
కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ఈ ఘటన బెంగుళూరు- మంగుళూరు జాతీయ రహదారిపై చోటు చేసుకొంది.
కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ఈ ఘటన బెంగుళూరు- మంగుళూరు జాతీయ రహదారిపై చోటు చేసుకొంది.
Also read:ఘెర రోడ్డు ప్రమాదం...8మంది మృతి, 22మందికి గాయాలు
కర్ణాటకలోని మంగుళూరు- బెంగుళూరు జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో వెనుక నుండి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమమాదంలో 12 మంది మృతి చెందారు.
బైలాదాకెరే వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. బోల్తా పడిన కారును వెనుక నుండి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో 12 మంది మృతి చెందారు. విషయం తెలుసుకొన్న వెంటనే పోలీసులు సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంతో బెంగుళూరు-మంగుళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.