Asianet News TeluguAsianet News Telugu

బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్: 10 మంది మావోల మృతి

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్‌లో గురువారం నాడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో పదిమంది మావోయిస్టులు మృతి చెందారు.  ఘటన స్థలంలో భారీగా మందుగుండు సామాగ్రిని, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

10 maoist killed in encounter in chattishgarh
Author
Chhattisgarh, First Published Feb 7, 2019, 1:09 PM IST


బీజాపూర్: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్‌లో గురువారం నాడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో పదిమంది మావోయిస్టులు మృతి చెందారు.  ఘటన స్థలంలో భారీగా మందుగుండు సామాగ్రిని, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

కూంబింగ్ జరుపుతున్న పోలీసులపై మావోలు కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తోంది.  ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

బీజాపూర్ జిల్లాలోని బైరాంఘడ్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకొందనిి పోలీసులు చెబుతున్నారు. పోలీసులకు, మావోలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకొన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.

ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులో ఉంది.  మావోలకు , పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకొంటున్నట్టు సమాచారం అందుతోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios