బీజాపూర్లో ఎన్కౌంటర్: 10 మంది మావోల మృతి
ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్లో గురువారం నాడు జరిగిన ఎన్కౌంటర్లో పదిమంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటన స్థలంలో భారీగా మందుగుండు సామాగ్రిని, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
బీజాపూర్: ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్లో గురువారం నాడు జరిగిన ఎన్కౌంటర్లో పదిమంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటన స్థలంలో భారీగా మందుగుండు సామాగ్రిని, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
కూంబింగ్ జరుపుతున్న పోలీసులపై మావోలు కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
బీజాపూర్ జిల్లాలోని బైరాంఘడ్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకొందనిి పోలీసులు చెబుతున్నారు. పోలీసులకు, మావోలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకొన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.
ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులో ఉంది. మావోలకు , పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకొంటున్నట్టు సమాచారం అందుతోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.