భారత వైమానిక దళంలో చేరనున్న తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు.. ఎప్పుడంటే..?
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లను అక్టోబరు 3న భారత వైమానిక దళం జోధ్పూర్ వైమానిక దళ స్టేషన్లో అధికారికంగా ప్రవేశపెట్టనుంది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఐఏఎఫ్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి హాజరుకానున్నారు.
భారత వైమానిక దళం మరింత పటిష్టం కానున్నది. రక్షణ రంగంలో స్వీయ-ఆధారితంగా మారే దిశలో భారత్ మరో అడుగు వేయనున్నది. ఈ మేరకు భారత వైమానిక దళం తొలి స్వదేశీ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లను రాజస్థాన్లోని జోధ్పూర్ వైమానిక దళ స్టేషన్లో ప్రవేశపెటట్టనున్నది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఐఏఎఫ్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ల సమక్షంలో అక్టోబర్ 3న తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ (ఎల్సిహెచ్)లను జోధ్పూర్ వైమానిక దళ స్టేషన్లో అధికారికంగా ప్రవేశబెట్టనున్నారు. ఈ తేలిక పాటి యుద్ద విమానాలను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ది చేసింది.
ఈ ఏడాది మార్చిలో 15 స్వదేశీ లైట్ అటాక్ హెలికాప్టర్ల (ఎల్సిహెచ్) కొనుగోలుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రతపై కేబినెట్ కమిటీ (సిసిఎస్) ఆమోదం తెలిపింది. రూ. 3387 కోట్లతో ఈ హెలికాప్టర్లను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) నుంచి కొనుగోలు చేశారు. వీటిలో 10 హెలికాప్టర్లు వైమానిక దళానికి, 5 భారత సైన్యం (ఆర్మీ)కి కేటాయించనున్నారు. భారత వైమానిక దళం, సైన్యంకు కలిపి 160 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు అవసరమని అంచనా వేసినందున ఫాలోఆన్ ఆర్డర్లను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆశిస్తోంది.
లైట్ కంబాట్ హెలికాప్టర్ ప్రత్యేకతలు..
ఈ హెలికాప్టర్ బరువు కేవలం 6 టన్నులు మాత్రమే. అదే సమయంలో.. అపాచీ బరువు దాదాపు 10 టన్నులు. తక్కువ బరువు కారణంగా.. ఈ హెలికాప్టర్లు ఎత్తైన ప్రాంతాలలో కూడా సులభంగా క్షిపణులు, ఇతర ఆయుధాలతో టేకాఫ్, ల్యాండింగ్ కాగలదు.
ఈ హెలికాప్టర్లు ప్రత్యేకంగా ఫ్రాన్స్ నుండి సేకరించిన 'మిస్ట్రాల్' ఎయిర్-టు-ఎయిర్, ఎయిర్-టు- ల్యాండ్ క్షిపణులను మోసుకెళ్లగలదు. తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల విలువ ప్రకారం 45శాతం స్వదేశీ పరికరాలను కలిగి ఉంది. ఇది సిరీస్ ప్రొడక్షన్ వెర్షన్ కోసం క్రమంగా 55శాతం కంటే ఎక్కువ పెరుగుతుంది.
15 ఏళ్ల కష్ట ఫలితం ఎల్సిహెచ్
కార్గిల్ యుద్ధం తర్వాత ఎల్సిహెచ్ స్వదేశీ దాడి హెలికాప్టర్ను సిద్ధం చేయాలని భారతదేశం నిర్ణయించుకుంది. అప్పట్లో 15-16 వేల అడుగుల ఎత్తులో ఉన్న శత్రు బంకర్లను ధ్వంసం చేయగల అటాక్ హెలికాప్టర్ భారత్ వద్ద లేదు. కానీ ఆ ప్రాజెక్టుకు 2006లో అనుమతి లభించింది. గత 15 ఏళ్ల కష్టపడి ఈ లైట్ కంబాట్ హెలికాప్టర్ (ఎల్సిహెచ్)ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ది చేసింది.
ఇటీవల భారత్ అపాచీ అడ్వాన్స్డ్ అటాక్ హెలికాప్టర్ను యుఎస్ నుండి కొనుగోలు చేసి ఉండవచ్చు, అయితే అపాచీ యుద్ద హెలికాప్టర్ .. కార్గిల్, సియాచిన్ వంటి శిఖరాలపై టేకాఫ్ , ల్యాండింగ్ చేయలేదు. అదే సమయంలో ఈ హెలికాప్టర్లు తేలికగా ఉండటం, ప్రత్యేక రోటర్లను కలిగి ఉండటం వలన ఎత్తైన శిఖరాలపై కూడా తన మిషన్లను నిర్వహించగలదు.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రకారం.. ఈ యుద్ద హెలికాప్టర్లు శత్రువు యొక్క రాడార్లో సులభంగా చిక్కుకోవు. శత్రు హెలికాప్టర్ లేదా ఫైటర్ జెట్ తన క్షిపణిని LCHలో లాక్ చేసినట్లయితే.. అది కూడా దానిని తప్పించుకోగలదు. శత్రువు కాల్పుల వల్ల హెలికాప్టర్ బాడీకే కాకుండా.. రోటర్లపై ఎలాంటి ప్రభావం చూపదు.
ఈ మిషన్ కోసం టెస్ట్ పైలట్కు ప్రత్యేక బాధ్యత అప్పగించబడింది. భూమిపై ఉన్న లక్ష్యాన్ని ఆకాశం నుండి తన దాడి హెలికాప్టర్తో నాశనం చేయడం బాధ్యత. దీని కోసం, అతను ఆకాశంలో అనుకరించవలసి వచ్చింది, అంటే ట్రయల్-టెస్ట్. ఎందుకంటే ఈ దాడి హెలికాప్టర్ శత్రువుల సైన్యం ట్యాంకులను లేదా ఉగ్రవాదుల రహస్య స్థావరాలను ఆకాశం నుండి కాల్పులు కురిపించేలా రూపొందించబడింది.