Asianet News TeluguAsianet News Telugu

ఘోర ప్రమాదం.. ఆస్పత్రిలో మంటలు.. పదిమంది చిన్నారులు మృతి

మరో ఏడుగురు చిన్నారులను రక్షించినట్లు హాస్పిటల్‌ సివిల్‌ సర్జన్‌ ప్రమోద్‌ ఖండతే పేర్కొన్నారు. 

10 children killed in fire at hospital in Maharashtra's Bhandara
Author
Hyderabad, First Published Jan 9, 2021, 7:37 AM IST

ఆస్పత్రిలోని ఐసీయూలో మంటలు చెలరేగి దాదాపు పది మంది నవజాత శిశువులు మృత్యువాత పడ్డారు. ఈ ఘోర ప్రమాదం మహారాష్ట్రలోని భండారా జిల్లా జనరల్ హాస్పిటల్ లో చోటుచేసుకుంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

భండారా జిల్లా జనరల్ హాస్పిటల్ లోని సిక్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ లో శుక్రవారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పది మంది మరణించగా.. మరో ఏడుగురు చిన్నారులను రక్షించినట్లు హాస్పిటల్‌ సివిల్‌ సర్జన్‌ ప్రమోద్‌ ఖండతే పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 17 మంది చిన్నారులు ఐసీయూలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

సుమారు రాత్రి 2గంటల సమయంలో డ్యూటీలో ఉన్న ఓ నర్స్‌ గదిలో నుంచి పొగలు రావడాన్ని గుర్తించింది. ఆ తర్వాత ఆమె వెంటనే అధికారులను అప్రమత్తం చేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యను ప్రారంభించింది. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు సంభవించినట్లు తెలిసింది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios