వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయి.. అలా చేస్తేనే పని భారం తగ్గుతుంది: సీజేఐ
ప్రస్తుతం సుప్రీంకోర్టులో మ్యాట్రిమోనియల్ కేసులకు సంబంధించి 3,000 పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని, పిటిషన్ దారులు తమకు నచ్చిన ప్రదేశానికి కేసులను బదిలీ చేయాలని కోరుతున్నాయని సుప్రీం కోర్టు పేర్కొంది.
సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తన ఫుల్ కోర్ట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ కేసులను తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు రోజూ 10 మ్యాట్రిమోని పిటిషన్లను, 10 బెయిల్ పిటిషన్లను విచారించాలని అన్ని బెంచ్లను కోరారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరితో జరిగిన సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
శీతాకాల సెలవులకు ముందే సమస్యలను పరిష్కరించుకోవాలి: ప్రధాన న్యాయమూర్తి
ఫుల్ కోర్ట్ మీటింగ్ తర్వాత ఒక్కో బెంచ్ రోజూ 10 మ్యాట్రిమోనియల్ బదిలీ కేసులు, 10 బెయిల్ కేసులను విచారించాలని నిర్ణయించామని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. శీతాకాల విరామానికి ముందే ఇలాంటి విషయాలన్నీ తేల్చుకోవాలి. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్టు తెలిపారు.
ఆ చేస్తేనే పని భారం తగ్గుతుంది: సుప్రీంకోర్టు
వివాహ సంబంధాలకు సంబంధించి ఇప్పటి వరకు 3,000 పిటిషన్లు సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉన్నాయని, పార్టీలు తమకు నచ్చిన ప్రదేశానికి కేసులను బదిలీ చేయాలని కోరుతున్నాయని ధర్మాసనం పేర్కొంది. ఒక్కో బెంచ్ రోజుకు 10 బదిలీ కేసులను విచారిస్తే, 13 బెంచ్లు రోజుకు 130 కేసులు, వారానికి 650 కేసులను పరిష్కరించగలవని బెంచ్ తెలిపింది. దీని వల్ల పనిభారం కూడా తీరిపోతుంది. ఈ 20 బెయిల్ మరియు బదిలీ పిటిషన్లను రోజూ పరిష్కరించిన తర్వాత, ధర్మాసనం సాధారణ విషయాలను చేపట్టడం ప్రారంభిస్తుందని సిజెఐ చెప్పారు. అర్థరాత్రి వరకు కేసుల ఫైళ్లను విచారించాల్సిన న్యాయమూర్తులపై భారాన్ని తగ్గించేందుకు అనుబంధ జాబితాలోని చివరి నిమిషంలో కేసుల జాబితాను తగ్గించాలని నిర్ణయించినట్లు జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.