Asianet News TeluguAsianet News Telugu

కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : నిజమవుతున్న ఎగ్జిట్ పోల్స్.. బీజేపీ షాకింగ్.. !!

కేరళలో ఎల్డీఎఫ్ ఆధిక్యంలో ఉంది. అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ పార్టీయే మరోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. మరోసారి పినరయి విజయ్ సీఎం అవుతారని కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. 

kerala election results 2021 : LDF leading, bjp leading in only 2 places - bsb
Author
Hyderabad, First Published May 2, 2021, 10:18 AM IST

కేరళలో ఎల్డీఎఫ్ ఆధిక్యంలో ఉంది. అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ పార్టీయే మరోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. మరోసారి పినరయి విజయ్ సీఎం అవుతారని కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. 

ఆదివారం జరుగుతున్న ఎన్నికల ఫలితాలు కూడా అవే ట్రెండ్స్ ను చూపిస్తున్నాయి. దాదాపుగా ఎల్డీఎఫ్ లీడింగ్ సీట్లలో మెజార్టీ మార్కును దాటింది. ఉదయం 9.30 సీట్లలో ఆధిక్యంలో ఉంది. యూడీఎఫ్ 55 సీట్ల ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఇక బీజేపీ కూటమి మాత్రం కేవలం రెండంటే రెండు సీట్ల ఆధిక్యంలోనే ఉంది.

ఇతరులు మూడు సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. వాస్తవానికి బీజేపీ కూటమికి 5 వరకు సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ, ప్రస్తుతానికి కేవలం రెండు స్థానాల్లోనే ఆధిక్యాన్ని కనబరుస్తోంది. 

కేరళ రాష్ట్రంలోని 140 సీట్లకు గాను ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతలో ఎన్నిక జరిగింది. రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుండి ఎంపీగా గెలుపొందడం, శబరిమల అంశము అన్ని వెరసి జాతీయ నాయకత్వమంతా కేరళలో తిష్ట వేసింది. ప్రధానంగా ఎల్ డి ఎఫ్, యూ డి ఎఫ్ కూటముల మధ్య పోరు సాగినప్పటికీ... తమ ప్రాబల్యాన్ని పెంచుకొని రాష్ట్ర రాజకీయాల్లో ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ సైతం ఇక్కడ భారీ ఎత్తున ప్రచారం సాగించింది. 

కేరళలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారడమనేది ఒక నిత్యకృత్యంగా తయారయింది. దేశంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కూడా కేరళనే. ఈ రాష్ట్రాన్ని నిలబెట్టుకొని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని ఎల్ డి ఎఫ్ రంగంలోకి దిగింది. 

దేశవ్యాప్తంగా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న కాంగ్రెస్ కి ఈ రాష్ట్రం గెలవడం అత్యవసరం. ఇక్కడ విజయం సాధించడం ద్వారా మొత్తం కాంగ్రెస్ క్యాడర్ లో ఒక జోష్ తీసుకురావొచ్చని వారు భావిస్తున్నారు. దానికి తోడు ఇక్కడ విజయాన్ని సాధించడాం ద్వారా రాహుల్ గాంధీ నాయకత్వానికి కూడా ఒక ఆమోదముద్ర పడుతుందని కాంగ్రెస్ వర్గాలు అనుకున్నాయి.

ఇక శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంలో కమ్యూనిస్టు ప్రభుత్వం వ్యవహరించిన తీరును బీజేపీ సాధ్యమైనంత మేర వాడుకుంది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఈ అంశం కలిసివస్తదని భావించినప్పటికీ... అది అంతలా కలిసిరాలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios