Asianet News TeluguAsianet News Telugu

Job recruitment 2022: రూ.40 వేల జీతంతో ఉద్యోగాలు.. త్వ‌ర‌గా ద‌ర‌ఖాస్తు చేసుకోండి..!

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 105 అసిస్టెంట్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 20, 2022.
 

Power Grid Recruitment 2022
Author
Hyderabad, First Published Feb 1, 2022, 3:18 PM IST

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 105 అసిస్టెంట్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 20, 2022.

మొత్తం 105 పోస్టుల్లో కంప్యూటర్ సైన్స్ లో 37, ఎలక్ట్రికల్ విభాగంలో 60, సివిల్ 4, ఎలక్ట్రానిక్స్ 4 ఖాళీ పోస్టులున్నాయి.   

కనీసం 60 శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రికల్/సివిల్/ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వాలిడ్ గేట్ 2021 స్కోర్ ఉండాలి.

వయసు: డిసెంబర్ 31, 2021 నాటికి 28 ఏళ్లు మించకూడదు.

వేతనం: ట్రెయినింగ్ పీరియడ్ లో నెలకి రూ.40 వేల వేతనంతో పాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. టైనింగ్ పూర్తి చేసుకున్నాక రూ.50 వేల నుంచి రూ.లక్షా 60 వేల వేతనంతో పాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. 

ఎంపిక విధానం: గేట్ 2021 మెరిట్ స్కోర్, బిహేవియర్ అసెస్ మెంట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వెబ్ సైట్: https://www.powergrid.in/

Follow Us:
Download App:
  • android
  • ios