- Home
- Telangana
- Jobs : కేవలం పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు, నేరుగా ఇంటర్వ్యూకు హాజరైతే చాలు
Jobs : కేవలం పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు, నేరుగా ఇంటర్వ్యూకు హాజరైతే చాలు
Job Mela in Telangana : తెలంగాణ యువతకు ప్రముఖ వాహనతయారీ సంస్థ మహింద్రా ఆండ్ మహింద్రా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం ప్రభుత్వమే జాబ్ మేళా నిర్వహిస్తోంది… దీనికి సంబంధించిన డిటెయిల్స్…

తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు..
Jobs : తెలంగాణ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. కేవలం పదో తరగతి అర్హతతో ఉద్యోగాలను పొందే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది. ఎలాంటి రాతపరీక్ష లేదు... నేరుగా ఇంటర్వ్యూకు హాజరైతే చాలు ఉద్యోగాన్ని పొందవచ్చు. ఈ నెల (ఫిబ్రవరి) 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు... కాబట్టి ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
జాబ్ మేళా ఎక్కడ..?
సంగారెడ్డి జిల్లా జహిరాబాద్ లో జాబ్ మేళా నిర్వహిస్తోంది ప్రభుత్వం. స్థానిక యువతకు ఇది అద్భుత అవకాశం. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సెర్ఫ్ ఈ ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 25న ఉదయం 10 గంటలకు జహిరాబాద్ ఎంపిడివో కార్యాలయంలో ఉద్యోగ మేళా ప్రారంభం అవుతుందని... కాబట్టి అంతకంటే ముందే ఆసక్తిగల నిరుద్యోగ యువత హాజరుకావాలని అధికారులు సూచించారు.
ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తారు..?
జహిరాబాద్ లో ప్రముఖ వాహనతయారీ పరిశ్రమ మహింద్రా ఆండ్ మహింద్రా పెద్దఎత్తున కార్యకలాపాలు సాగిస్తోంది. ట్రాక్టర్లతో పాటు వివిధ వాహనాలు ఇక్కడే తయారవుతాయి. ఈ పరిశ్రమలోనే ఉద్యోగాలను పొందే అవకాశాన్ని స్థానిక యువతకు కల్పిస్తోంది ప్రభుత్వం. మొత్తం 500 అప్రెంటిస్షిప్ పోస్టులను ఫిబ్రవరి 25న జరిగే జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు.
విద్యార్హతలు, వయోపరిమితి
పదో తరగతి పూర్తిచేసినవారు ఈ ఉద్యోగులకు అర్హులే. అలాగే ఇంటర్మీడియట్, ఐటిఐ చేసినవారు జాబ్ మేళాకు హాజరుకావచ్చు. కేవలం మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలను భర్తీ చేస్తారు... అంటే మంచి మార్కులు కలిగినవారికి పక్కా జాబ్ అన్నమాట.
మహింద్రా ఆండ్ మహింద్రాలో ఉద్యోగాల కోసం జాబ్ మేళాకు హాజరయ్యేవారి వయసు 18 ఏళ్ల నుండి 25 ఏళ్లలోపు ఉండాలి. వీరినే ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.. 25 ఏళ్లకంటే ఎక్కువ వయసువారు అనర్హులు. అంటే యువకులకే ఈ ఉద్యోగాలను పొందే అవకాశం ఉంటుందన్నమాట.
శాలరీ
పదో తరగతి అర్హతతో ఉద్యోగాలను పొందేవారికి నెలకు కనీస వేతనం రూ.10,500 ఉంటుంది.
ఇంటర్మీడియట్ అర్హతతో ఉద్యోగాన్ని పొందేవారికి కనీస వేతనం రూ.11,400 ఉంటుంది.
ఐటిఐ అర్హతతో ఉద్యోగాన్ని పొందేవారికి కూడా కనీస వేతనం రూ.11,400 ఉంటుంది.
గమనిక : ఇంటర్వ్యూకు విద్యార్హతలకు సంబంధించిన పత్రాలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాఫీలతో పాటు పాస్ పోర్ట్ సైజు ఫోటోలతో హాజరవ్వాలి.

