Asianet News TeluguAsianet News Telugu

జ్యుడిషియల్ సర్వీసెస్ 2019 నోటిఫికేషన్ విడుదల

ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఒపిఎస్సి) ఖాళీగా ఉన్న 51 సివిల్ జడ్జి పోస్టులను జ్యుడిషియల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2019 ద్వారా భర్తీ చేస్తుంది.ప్రకటించిన మొత్తం 51 ఖాళీలలో 17 పోస్టులు మహిళా అభ్యర్థులకు కేటాయించబడ్డాయి.

judicial notification 2019 released
Author
Hyderabad, First Published Nov 15, 2019, 2:37 PM IST

న్యూ ఢిల్లీ : ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (OPSC) సివిల్ జడ్జి పోస్టులలో ఖాళీగా ఉన్న 51 పోస్టులను జ్యుడిషియల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2019 ద్వారా భర్తీ చేస్తుంది. ఒడిశా జ్యుడిషియల్ సర్వీసెస్ పరీక్ష కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 19 న ప్రారంభమై 18 డిసెంబర్  2019 తో ముగుస్తుంది. దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన చివరి తేదీ 23 డిసెంబర్ 2019.

ప్రకటించిన మొత్తం 51 ఖాళీలలో 17 పోస్టులు మహిళా అభ్యర్థులకు కేటాయించబడ్డాయి.పరీక్షకు అర్హత పొందాలంటే అభ్యర్థి ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ యొక్క చట్టంలో గ్రాడ్యుయేషన్ పొంది ఉండాలి.  దరఖాస్తుదారుడు ఓడియాను చదవగలిగి, వ్రాయగలిగి మరియు మాట్లాడగలిగి ఉండాలి.  

also read పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల : 3278 ఖాళీలు

మిడిల్ స్కూల్ ఎగ్జామినేషన్‌ను పాస్ అయిఉండాలి అందులో ఓడియా భాషా సబ్జెక్టుగా ఉత్తీర్ణత కలిగి ఉండాలి లేదా దానికి సమానమైన విద్యా అర్హత ఉండాలి.దరఖాస్తుదారుడు 23 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండకూడదు. ఆగస్టు 1, 2019 నాటికి 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు మించకూడదు.

ఈ ప్రయోజనం కోసం సూచించిన ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది.అర్హత గల అభ్యర్థులు ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (OPSC), 'opsconline.gov.in' కోసం అధికారిక దరఖాస్తు పోర్టల్ నుండి పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.

also read SCR : సౌత్ సెంట్రల్ రైల్వేలో 4103 ఖాళీలు

ఎంపిక ప్రక్రియలో ప్రాథమిక పరీక్ష, ప్రధాన పరీక్ష మరియు ఇంటర్వ్యూలు  ఉంటాయి. ప్రాథమిక పరీక్ష ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది. ప్రాథమిక పరీక్ష తేదీని కమిషన్ తరువాత ప్రకటిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios