Asianet News TeluguAsianet News Telugu

సివిల్ సర్వీస్ 2019 నోటిఫికేషన్ విడుదల

మధ్య ప్రదేశ్ (ఎం.పి) సివిల్ సర్వీస్ పరీక్ష, రాష్ట్ర అటవీ సేవా పరీక్ష వివరాలను మధ్య ప్రదేశ్  ప్రకటించారు. పరీక్షకు అర్హత ఉన్న అభ్యర్థులు నవంబర్ 20 నుంచి డిసెంబర్ 9 వరకు అధికారిక వెబ్‌సైట్ mppsc.nic.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.
 

civil services notification released
Author
Hyderabad, First Published Nov 15, 2019, 3:16 PM IST

న్యూ ఢిల్లీ : మధ్యప్రదేశ్ సివిల్ సర్వీస్ పరీక్ష జనవరి 12 న జరుగుతుంది. మధ్యప్రదేశ్ స్టేట్ సర్వీస్ ఎగ్జామ్ అని కూడా పిలువబడే ఈ పరీక్షను స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ తో పాటు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం నియామకానికి, కమిషన్ పరీక్ష వివరాలను తెలియజేసింది.

also read  పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల : 3278 ఖాళీలు

పరీక్షకు అర్హత ఉన్న అభ్యర్థులు నవంబర్ 20 నుంచి డిసెంబర్ 9 వరకు అధికారిక వెబ్‌సైట్ mppsc.nic.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. 21-40 సంవత్సరాల మధ్య వయస్సు గల గ్రాడ్యుయేట్లు పరీక్ష రాయడానికి అర్హులు.

మొత్తం 330 ఖాళీలను కమిషన్ రాష్ట్ర సేవా పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది మరియు అటవీ అసిస్టెంట్ కన్జర్వేటర్ యొక్క 6 పోస్టులను రాష్ట్ర అటవీ సర్విస్ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు.

also read  జ్యుడిషియల్ సర్వీసెస్ 2019 నోటిఫికేషన్ విడుదల

ప్రిలిమ్స్, మెయిన్ ఎగ్జామ్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా పోస్టులకు ఎంపిక ఉంటుంది. ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ టైప్ బేస్డ్ మరియు ప్రధాన పరీక్ష డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష కోసం అభ్యర్థులు శారీరక ధృడత్వ పరీక్ష కోసం హాజరు కావాల్సి ఉంటుంది.

అభ్యర్థులు నవంబర్ 23 నుండి డిసెంబర్ 11 వరకు తమ దరఖాస్తు పత్రాలను ఎడిట్ చేసుకోడానికి అనుమతించబడతారు. ప్రతి కరెక్షన్ కు అభ్యర్థులు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios