నిద్రలో కరోనా వైరస్ ఏమీ చెయ్యదట... పాక్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఈ క్రమంలో అక్కడ ఓ రాజకీయ నాయకుడు వైరస్పై విచిత్ర వ్యాఖ్యలు చేశారు. "నువ్వు ఎంతసేపు పడుకుంటే కరోనా అంతసేపు నిద్రిస్తుంది. మనం చనిపోతే కరోనా చనిపోతుంది. అంతే.. " అంటూ విచిత్ర కామెంట్స్ చేశారు.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలా కుతలం చేస్తోంది. లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. భారత్ లోనూ దీని ప్రభావం విపరీతంగా పెరిగిపోతోంది. అటు పొరుగు దేశమైన పాకిస్తాన్ కరోనాను ఎదుర్కోలేక పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థతో కొట్టుమిట్టాడుతోంది.
ఈ క్రమంలో అక్కడ ఓ రాజకీయ నాయకుడు వైరస్పై విచిత్ర వ్యాఖ్యలు చేశారు. "నువ్వు ఎంతసేపు పడుకుంటే కరోనా అంతసేపు నిద్రిస్తుంది. మనం చనిపోతే కరోనా చనిపోతుంది. అంతే.. " అంటూ విచిత్ర కామెంట్స్ చేశారు.
"నిద్రించే సమయంలో వైరస్ ఎలాంటి హాని చేయదు. పైగా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ఎక్కువ గంటలు నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు" అంటూ పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సభ్యుడు ఫజల్ ఉర్ రెహ్మాన్ పేర్కొన్నారు.. ఈ వీడియోను పాక్ జర్నలిస్టు నైలా ఇనాయత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది.
దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. "అవును, ఈ మాటలు వింటే కరోనా నిజంగానే చనిపోతుంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు. "ఇంతకీ పరిష్కారం ఏంటంటారు? ఇప్పుడు మనం నిద్రపోవాలా? చచ్చిపోవాలా?" అని వ్యంగ్యంగా ప్రశ్నించారు.