floods: అమెరికాలో వర్ష బీభత్సం.. కెంటకీలో 26 మంది మృతి..
US floods: తూర్పు కెంటకీలో సంభవించిన వరదలలో కనీసం 26 మంది మరణించారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషీర్ తెలిపారు.
US Kentucky floods: అమెరికాలోని తూర్పు కెంటకీలోని కొన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. దీంతో ఇప్పటివరకు నలుగురు పిల్లలు సహా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది తప్పిపోయారు. వారి కోసం గాలింపు చర్యలు, రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని యూఎస్ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. "తూర్పు కెంటుకీలోని వరదల బారిన పడిన ప్రాంతాలలో మరణించిన వారి సంఖ్య కనీసం 25కి చేరుకుంది. తప్పిపోయిన నివాసితుల కోసం విపత్తు నిర్వహన బృందాలు పని చేస్తున్నాయి. ఇప్పటికీ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి" అని రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషీర్ను ఉటంకిస్తూ CNN నివేదించింది. తూర్పు కెంటకీలో సంభవించిన వరదలలో కనీసం 26 మంది మరణించారు. మరణాల సంఖ్య మాత్రమే పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషీర్ తెలిపినట్టు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.
US అధ్యక్షుడు జో బైడెన్ వరదలను పెద్ద విపత్తు అని ప్రకటించారు. సంఘటనను పరిగణనలోకి తీసుకుని, స్థానిక విపత్తు నిర్వహణ బృందాలకు సహాయం చేయడానికి ఫెడరల్ సహాయాన్ని ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జో బైడెన్ చెప్పారు. "కెంటకీలో వరదల కారణంగా స్థానభ్రంశం చెందిన కుటుంబాలకు, ప్రాణాలు కోల్పోయిన వారికి సహాయం చేయడానికి నేను మరిన్ని చర్యలు తీసుకుంటున్నాను. ఈరోజు, వరదల్లో చిక్కుకున్న వారి సహాయాన్ని వేగవంతం చేయడానికి నేను ఆమోదించిన మేజర్ డిజాస్టర్ డిక్లరేషన్కు వ్యక్తిగత సహాయాన్ని కూడా జోడించాను” అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ట్వీట్ చేశారు.
కెంటుకీ గవర్నర్ ఆండీ బెషీర్ ఇటీవలి వరదలను ఈ ప్రాంతంలో అత్యంత వినాశకరమైన వరదలుగా పేర్కొన్నారు. తక్షణ లక్ష్యం సాధ్యమైనంత ఎక్కువ మందిని సురక్షితంగా ఉంచడం" అని అన్నారు. "ప్రస్తుతం ఇది చాలా కష్టమైన విషయం, విధ్వంసం ఎంత విస్తృతంగా ఉంది. ప్రభావితమైన ప్రాంతాలతో, తప్పిపోయిన వ్యక్తులకు సంబంధించి ఇంకా స్పష్టమైన వివరాలు లభించలేదు" అని రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషీర్ అన్నారు. వరదల కారణంగా తప్పిపోయిన వ్యక్తుల వివరాలను అందించాలని స్థానిక నివాసితులను కోరారు. కెంటుకీ, టేనస్సీ, వెస్ట్ వర్జీనియా నుండి నేషనల్ గార్డ్ సభ్యులు, అలాగే కెంటుకీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్, స్టేట్ పోలీస్ అధికారులు ఇటీవలి రోజుల్లో వందలాది మందిని వాయు, జల మార్గాల ద్వారా రక్షించారని రాష్ట్ర గవర్నర్ చెప్పారని CNN నివేదించింది. కొన్ని కౌంటీలలో సెల్ఫోన్ సేవలు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. తాగునీటి సమస్యలు కూడా ఉన్నాయని తెలిపారు.
“తూర్పు కెంటుకీలోని ప్రతి ఒక్కరికీ, మేము ఈ రోజు మరియు రాబోయే వారాలు, నెలలు-సంవత్సరాలలో మీ కోసం అక్కడ ఉండబోతున్నాము. మేము అందరితో కలిసి ఈ దారుణ పరిస్థితులను ఎదుర్కొంటాము” అని బెషీర్ ట్వీట్ చేశారు. "అంచనా వేయలేని నష్టాన్ని చవిచూసిన కుటుంబాల కోసం మేము ప్రార్థిస్తూనే ఉన్నాము. కొందరు తమ ఇంటిలోని ప్రతి ఒక్కరినీ కోల్పోయారు" అని చెప్పారు. ఇంకా మరణాలు సంఖ్య పెరుగుతూనే ఉంది" అని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, అందుకు ప్రజలు, యంత్రాంగం సిద్ధం కావాలని కెంటకీ గవర్నర్ సూచించారు.