Asianet News TeluguAsianet News Telugu

లోయలో పడిన బస్సు..20మంది మృతి

బస్సు ప్రమాదవశాత్తు పర్వత ప్రాంతం నుంచి లోయలోకి పడిపోయింది.ఈ ఘటనలో 20మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

Twenty killed after bus plunges from mountain road in Pakistan
Author
Hyderabad, First Published Mar 10, 2020, 8:32 AM IST

బస్సు లోయలో పడి 20మంది దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన  పాకిస్థాన్ లో సోమవారం చోటుచేసుకుంది. గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫైజుల్లా తెలిపిన వివరాల ప్రకారం... రావల్పిండి నుంచి స్కర్దు ప్రాంతానికి ఓ బస్సు  25మంది ప్రయాణికులతో బయలుదేరింది.

Also Read రైలుని ఢీకొట్టిన బస్సు... 20మంది మృతి...

ఈ క్రమంలో బస్సు ప్రమాదవశాత్తు పర్వత ప్రాంతం నుంచి లోయలోకి పడిపోయింది.ఈ ఘటనలో 20మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

ఇప్పటి వరకు 8మంది మృతదేహాలను వెలికి తీశారు.  సైనిక హెలికాప్టర్ల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios