లోయలో పడిన బస్సు..20మంది మృతి
బస్సు ప్రమాదవశాత్తు పర్వత ప్రాంతం నుంచి లోయలోకి పడిపోయింది.ఈ ఘటనలో 20మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.
బస్సు లోయలో పడి 20మంది దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన పాకిస్థాన్ లో సోమవారం చోటుచేసుకుంది. గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫైజుల్లా తెలిపిన వివరాల ప్రకారం... రావల్పిండి నుంచి స్కర్దు ప్రాంతానికి ఓ బస్సు 25మంది ప్రయాణికులతో బయలుదేరింది.
Also Read రైలుని ఢీకొట్టిన బస్సు... 20మంది మృతి...
ఈ క్రమంలో బస్సు ప్రమాదవశాత్తు పర్వత ప్రాంతం నుంచి లోయలోకి పడిపోయింది.ఈ ఘటనలో 20మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.
ఇప్పటి వరకు 8మంది మృతదేహాలను వెలికి తీశారు. సైనిక హెలికాప్టర్ల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.