పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా సెహెజెన్ జోన్ పరిధిలోని 26 దేశాలకు రవాణాపరమైన ఆంక్షలు విధించారు.
పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా సెహెజెన్ జోన్ పరిధిలోని 26 దేశాలకు రవాణాపరమైన ఆంక్షలు విధించారు.
వాటిలో యూకే, ఐర్లాండ్, బ్రెజిల్ తదితర దేశాలు ఉన్నాయి. ఈ దేశాలకు అమెరికా నుంచి ప్రయాణాలను నిషేధించారు. ఆ దేశాలకు జనవరి 26వ తేదీ వరకు నిషేధం విధిస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.
ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసులు, మృతులు అమెరికాలోనే నమోదయ్యాయి. ఆ దేశంలో మొత్తం 2,41,10,876 కేసులు నమోదవగా, మృతులు 3,98,915మంది ఉన్నారు. ఇంకా కరోనా తీవ్ర రూపంలో విజృంభిస్తోంది. అయితే కొత్త రకం వైరస్ బ్రిటన్, బ్రెజిల్లో వెలుగులోకి రావడంతో ఈ మేరకు ట్రంప్ ఆ దేశాల నుంచి ప్రయాణాలను నిషేధించారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో యూరప్, బ్రెజిల్ ప్రయాణికుల రాకపై విధించిన ఆంక్షలను జనవరి 26 నుంచి ఎత్తివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించడాన్ని, నూతన అధ్యక్షుడు బైడెన్ బృందం తోసిపుచ్చింది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 19, 2021, 11:44 AM IST