ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్, వ్యాన్ ఢీ.. 13 మంది మృతి.. ఎక్కడంటే ?
ఉత్తర మెక్సికో రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రాక్టర్, వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 13 మంది మరణించారు. మరి కొందరికి గాయాలయ్యాయి.
ట్రాక్టర్, వ్యాన్ ఢీకొనడంతో 13 మంది మరణించారు. మరి కొందరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఉత్తర మెక్సికో రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటన సమయంలో విపరీతంగా మంటలు కూడా చెలరేగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర మెక్సికో రాష్ట్రంలోని తమౌలిపాస్ లో ఆదివారం ఉదయం హైవేపై ఓ ట్రాక్టర్-ట్రైలర్, వ్యాన్ ఢీకొట్టుకున్నాయి.
100 మీటర్ల లోయలో పడ్డ ట్రక్కు.. చిన్నారితో సహా ఐదుగురు మృతి
వ్యాన్ లో ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో 13 మంది మరణించారు. ఈ ఘటన చోటు చేసుకున్న అనంతరం వ్యాన్ లో మంటలు చెలరేగాయి. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఆ సమయంలో ట్రాక్టర్-ట్రైలర్ అక్కడ లేదని తమౌలిపాస్ ప్రజా భద్రతా మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా.. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు దుర్మరణం
ఇలాంటి ఘటనే మన దేశంలోని తమిళనాడులో ఈ నెల 12వ తేదీన చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మరణించగా.. 26 మందికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. గత శుక్రవారం సంగీత బృందం ఓ ప్రభుత్వ బస్సులో చెన్నై వైపు వెళ్తున్నారు. అయితే ఆ బస్సు నాగర్ కోయిల్ సమీపంలో ఓ డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో టూ వీలర్ ఢీకొట్టే పరిస్థితుల నుంచి తప్పించే ప్రయత్నంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్యాంకర్ ట్రక్కును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. 26 మంది గాయపడగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను చిదంబరం, పద్మనాభన్, అరుళ్రాజ్, బాలమురుగన్ గా గర్తించారు. తీవ్రంగా గాయపడిన 8 మంది ప్రయాణికులను మెరుగైన చికిత్స కోసం చిదంబరం ఆసుపత్రికి తరలించారు.