Asianet News TeluguAsianet News Telugu

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు దుర్మరణం

ఏపీలోని కడపలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుఫాన్ వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. ఈ ఘటన కొండాపురం మండలంలో జరిగింది. 

Fatal road accident in Kadapa district: Seven dead..ISR
Author
First Published May 15, 2023, 6:55 AM IST

కడప: ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. తిరుమల నుంచి తాడిపత్రి వెళ్తున్న తుఫాన్ వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. కడప జిల్లా కొండాపురం మండలం చిత్రావతి వంతెన సమీపంలో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 11 మంది ప్రయాణికులు ఉన్నారు.

మరణించినవారు తాడిపత్రికి చెందినవారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios