కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు దుర్మరణం
ఏపీలోని కడపలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుఫాన్ వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. ఈ ఘటన కొండాపురం మండలంలో జరిగింది.
కడప: ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. తిరుమల నుంచి తాడిపత్రి వెళ్తున్న తుఫాన్ వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. కడప జిల్లా కొండాపురం మండలం చిత్రావతి వంతెన సమీపంలో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 11 మంది ప్రయాణికులు ఉన్నారు.
మరణించినవారు తాడిపత్రికి చెందినవారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.