సారాంశం

భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, నాసాకు చెందిన బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తిరిగి పయనమయ్యారు. భారతకాలమాన ప్రకారం బుధవారం తెల్లవారు జామున వారు భూమిపై ల్యాండ్ కానున్నారు. ఈ నేపథ్యంలో వ్యోమగాములు ఎక్కడ, ఎలా ల్యాండ్ కానున్నారు. ఇప్పుడు తెలుసుకుందాం.. 

గత 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో చిక్కుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు భూమికి తిరిగి రానున్నారు.

అంతా అనుకున్న ప్రకారం జరిగితే సునీత, బుచ్‌తో పాటు రష్యాకు చెందిన అలెగ్జాండర్ గోర్బునోవ్, అమెరికాకు చెందిన నిక్ హేగ్ కూడా ఆకాశం నుంచి భూమికి దిగనున్నారు. ఈ నలుగురు వ్యోమగాములను ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని స్పేస్‌ఎక్స్ కంపెనీకి చెందిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ భూమికి తీసుకురానుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తెలిపింది.

భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.30 గంటలకు ఐఎస్‌ఎస్ నుంచి నౌక బయలుదేరింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు ఫ్లోరిడా సముద్రంలో నౌక దిగనుంది. అక్కడి నుంచి ప్రత్యేక పడవల ద్వారా తీరానికి చేరుకుంటారు. దీనికి సంబంధించిన పూర్తి ప్రక్రియను నాసా లైవ్ టెలికాస్ట్ చేయనుంది. క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ఇటీవల ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి ఎగిరిన 29 గంటల తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది.

సునీత, బుచ్ 8 రోజుల పని కోసం ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. అయితే వారు వెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ నౌకలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వారి రాక పదే పదే వాయిదా పడి 9 నెలల వరకు పొడగించాల్సి వచ్చింది. దీంతో ఇన్ని రోజులు వ్యోమగాములు స్పేస్ లోనే చిక్కుకుపోయారు. 

.@NASA will provide live coverage of Crew-9’s return to Earth from the @Space_Station, beginning with @SpaceX Dragon hatch closure preparations at 10:45pm ET Monday, March 17.

Splashdown is slated for approximately 5:57pm Tuesday, March 18: https://t.co/yABLg20tKX pic.twitter.com/alujSplsHm