Asianet News TeluguAsianet News Telugu

చరిత్ర సృష్టించబోతున్న రిషి సునక్.. 200 ఏళ్లలో బ్రిటన్ కు అతి చిన్న వయస్సులో ప్రధానిగా పగ్గాలు

200 ఏళ్ల బ్రిటన్ చరిత్రలో అతి చిన్న వయస్సులో ఆ దేశ ప్రధానమంత్రిగా రిషి సునక్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. అలాగే మొదటి హిందూ, మొదటి శ్వేతజాతీయేతర ప్రధానిగా రికార్డు నెలకొల్పనున్నారు. 

Rishi Sunak, who is going to create history, will become the youngest Prime Minister of Britain in 200 years
Author
First Published Oct 25, 2022, 11:08 AM IST

బ్రిటన్ కొత్త ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునక్ చరిత్ర సృష్టించారు. సరిగ్గా దీపావళి నాడు పెన్నీ మోర్డెంట్ రేసు నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించడంతో సునక్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో సోమవారం దీపావళి సందర్భంగా యూకే  మొదటి భారతీయ సంతతి, మొదటి హిందూ, మొదటి శ్వేతజాతీయేతర ప్రధాన మంత్రిగా రికార్డు నెలకొల్పారు. 

రెండు నెలల కిందట నాయకత్వ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఆయన అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 100 మంది ఎంపీల నామినేషన్ల పరిమితిని క్లియర్ చేసిన ఏకైక అభ్యర్థి అయ్యారు. దీంతో ఆటోమెటిక్ గా తదుపరి కన్జర్వేటివ్ నాయకుడు, బ్రిటిష్ ప్రధాన మంత్రిగా ఎంపికయ్యారు. మధ్యాహ్నం 1.59 గంటలకు హౌస్ ఆఫ్ కామన్స్ నాయకుడు మోర్డాంట్ ప్రధాని రేసు నుంచి వైదొలుగుతున్నట్టు ట్వీట్ చేశారు. ‘‘ఈ రోజు రిషి మనకు ఖచ్చితంగా అవసరమని తోటి నాయకులు భావిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. వారు మంచి విశ్వాసంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రిషితో కలిసి పని చేయడానికి రుణపడి ఉంటాం. రిషికి నా పూర్తి మద్దతుద్ద ఉంది.’’ అని పేర్కొన్నారు. 

చిట్టి చిట్టి చేతులతో... తండ్రికి మేకప్ వేసిన కూతురు...!

సోమవారం జరిగిన పరిణామాల వల్ల బ్రిటన్ కు 200 ఏళ్లలో అతి చిన్న వయస్సులో రిషి (42 సంవత్సరాలు) ప్రధాని అయ్యారు. 1812 తరువాత ఇంత తక్కువ వయస్సున్న వ్యక్తి ప్రధాని కావడం ఇదే ప్రథమం. ఒక సారి రాజు ప్రభుత్వా న్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానించిన తరువాత ఆయన తదుపరి బ్రిటిష్ ప్రధానమంత్రి కానున్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణ మూర్తి కుమార్తె, రిషి భార్య అక్షతా మూర్తి, తన ఇద్దరు పిల్లలతో కలిసి అధికారిక భవనంలో నివసించనున్నారు. ఎంపీగా ఎన్నికైన ఏడు సంవత్సరాల అతి తక్కువ సమయంలో ఆయన ఉన్నత పదవిని అధిరోహించనున్నారు. 

కాగా.. బ్రిటన్ రాజు సోమవారం రాత్రి లండన్ కు తిరిగి వస్తారు. సునక్ ను పిలిచి బకింగ్హామ్ ప్యాలెస్ కు ఆహ్వానించాలని భావిస్తున్నారు. మాజీ ఎంపీ బోరిస్ జాన్సన్ కు బెయిల్ వచ్చిన తరువాత చాలా మంది మద్దతుదారులు ఆమె వద్దకు చేరుతారని మోర్డాంట్ అనుకున్నారు. కానీ వాస్తవానికి ప్రీతి పటేల్ తో పాటు చాలా మంది సోమవారం ఉదయం సునక్ కు మద్దతుగా నిలిచారు.

బస్సులో చెలరేగిన మంటలు.. డ్రైవర్, హెల్పర్ సజీవదహనం.. ఆ తప్పిదమే కారణమా..?

కాగా.. భారత సంతతికి చెందిన రిషి సునక్ హిందూ మతాన్ని పాటిస్తున్నారు. ఆయన 2020 సంవత్సరంలో దీపావళి నాడు నంబర్ 11 వెలుపల దీపాలను వెలిగించారు. ఈ ఏడాది ఆగస్టులో ఛాన్సలర్ గా ఉన్న సమయంలో ఆయన హెర్ట్ఫోర్ట్ లోని ఇస్కా న్ భక్తివేక్తిదాంత మనోర్ ను సందర్శించారు. ఆయన అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. మణికట్టుపై పవిత్రమైన దారాన్ని ధరించారు. 

ఇదిలా ఉండగా.. సునక్ విజయాన్ని అందరూ స్వాగతించలేదు. లేబర్ డిప్యూటీ లీడర్ ఎంనీ ఏంజెలా రేనర్ స్పందిస్తూ.. ‘‘ రిషి సునక్ దేశాన్ని ఎలా నడిపిస్తాడనే విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఎవరికీ ఓటు వేసే అవకాశం లేకుండా టోరీలు ఆయనకు ప్రధాన మంత్రిగా పట్టాభిషేకం చేశారు. మాకు సాధారణ ఎన్నికలు కావాలి.’’ అని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios