Asianet News TeluguAsianet News Telugu

పర్వేజ్ ముషారఫ్‌ కన్నుమూత: అమైలాయిడోసిస్‌‌తో పోరాడుతూ మృతి.. ఈ అరుదైన వ్యాధి గురించిన వివరాలు ఇవే..

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముషారఫ్ దుబాయ్‌లోని అమెరికన్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు.

Pervez Musharraf passes away he was suffering with amyloidosis Know all about it
Author
First Published Feb 5, 2023, 1:23 PM IST

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముషారఫ్ దుబాయ్‌లోని అమెరికన్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. అయితే మృతికి ప్రధానంగా అమైలాయిడోసిస్ అనే అరుదైన వ్యాధి కారణంగా తెలుస్తోంది. గత కొంతకాలంగా అమైలాయిడోసిస్‌తో బాధపడుతున్న ముషారఫ్ దుబాయ్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ వ్యాధి కారణంగా శరీరంలోని అవయవాలు పనిచేయకుండా వైఫల్యం చెందుతాయి. 

అమైలాయిడోసిస్‌ అనేది ఒక వ్యక్తి యొక్క అవయవాలలో అమిలాయిడ్ పదార్థం పేరుకుపోయినప్పుడు అభివృద్ధి చెందే అరుదైన పరిస్థితి. సాధారణంగా పనిచేసే వారి సామర్థ్యాన్ని ఇది ప్రభావితం చేస్తుంది. అమైలాయిడ్ ప్రోటీన్ సాధారణంగా శరీరంలో కనిపించదు.. కానీ ఇది వివిధ రకాల ప్రోటీన్ల నుంచి తయారవుతుంది. ఎముక మజ్జ అమిలాయిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది.. కణజాలం లేదా అవయవంలో పేరుకుపోయే అసహజ ప్రోటీన్. అమైలాయిడోసిస్‌తో బాధపడుతున్న రోగులలో గుండె, మూత్రపిండాలు, ప్లీహము, నాడీ వ్యవస్థ, జీర్ణవ్యవస్థ ప్రభావితమవుతాయి. ఈ వ్యాధి కొన్ని రకాలు ప్రాణాంతకం. 

Also Read: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత..!

అమైలాయిడోసిస్‌లో అనేక రకాలు ఉన్నాయి. కొన్ని రకాలు వారసత్వంగా సంక్రమిస్తాయి. మరికొన్ని రకాలు దీర్ఘకాలిక డయాలసిస్ లేదా ఇన్ఫ్లమేటరీ అనారోగ్యాలు వంటి బాహ్య కారణాల వల్ల వస్తాయి. అమైలాయిడోసిస్‌లోని కొన్ని రకాలు అనేక అవయవాలను ప్రభావితం చేస్తే.. మరికొన్ని శరీరంలోని ఒక ప్రాంతాన్ని మాత్రమే ప్రభావితం చేస్తాయి. అమైలాయిడోసిస్‌ కొన్ని లక్షణాలను పరిశీలిస్తే.. చీలమండలు వాపు, తీవ్రమైన అలసట, బలహీనత, శ్వాస ఆడకపోవుట, చేతులు లేదా పాదాలలో తిమ్మిరి, జలదరింపు లేదా నొప్పి, మలబద్ధకం, ఆకస్మికంగా బరువు తగ్గడం, చర్మంలో మార్పులు, కళ్ళ చుట్టూ ఊదా రంగు మచ్చలు, హృదయ స్పందన సక్రమంగా లేకపోవడం వంటివి ఉన్నాయి. 

ఇక, ముషారఫ్ 1943 ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించారు. వారి కుటుంబం 1947లో న్యూఢిల్లీ నుంచి కరాచీకి తరలివెళ్లింది. ముషారఫ్ కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్‌లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. లాహోర్‌లోని ఫోర్మాన్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు.

ముషారఫ్ 1964లో పాకిస్థాన్ సైన్యంలో చేరారు. క్వెట్టాలోని ఆర్మీ స్టాఫ్ అండ్ కమాండ్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అయ్యారు. 1998లో ఆయన జనరల్ స్థాయికి పదోన్నతి పొందారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1999లో నవాజ్ షరీఫ్ సర్కార్‌పై తిరుగుబాటు చేసి  అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవిని చేపట్టారు. 2001 నుంచి 2008 వరకు పాకిస్తాన్ అధ్యక్షునిగా కొనసాగారు. అభిశంసనను తప్పించుకునేందుకు పదవికి రాజీనామా చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios