భారత్ స్పందనతో పాకిస్థాన్‌లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇస్లామాబాద్‌లో 48 గంటలపాటు పెట్రోల్ బంద్ చేస్తున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.

భారత్ దాడులతో పాకిస్థాన్‌లో వాతావరణం ఉత్కంఠగా మారింది. సరిహద్దు వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన సరఫరాలో భారీ అంతరాయం ఏర్పడింది. తాజా సమాచారం ప్రకారం, పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని అన్ని పెట్రోల్ మరియు డీజిల్ పంపులను తాత్కాలికంగా మూసివేయాలని అక్కడి అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ ఆదేశాలు శనివారం ఉదయం అమల్లోకి వచ్చాయని తెలుస్తోంది. ఈ నిర్ణయానికి స్పష్టమైన కారణాలు ప్రకటించకపోయినా, పాకిస్థాన్‌లో మౌలిక వనరులపై పెరుగుతున్న ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం, భారత్ గట్టిగా ప్రతిస్పందించడంతో పాకిస్థాన్‌లో ఇంధన సరఫరా తీవ్రంగా ప్రభావితమైందని చెబుతున్నాయి.ఈ నిర్ణయం వల్ల ప్రైవేట్ వాహనదారులు, ప్రజా రవాణా వ్యవస్థలు, వాణిజ్య కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇస్లామాబాద్ నగరంలో జనరేటర్లు ఆధారంగా నడుస్తున్న వ్యాపారాలు, ఆసుపత్రులు, కార్యాలయాల పనితీరుపైనా ప్రభావం పడనుంది. అధికారులు ప్రకటించిన 48 గంటల గడువు వరకు ప్రజలు ఇంధన దుకాణాల వద్ద ఇంధనం పొందలేని పరిస్థితి నెలకొంది.

ఇంధన కొరత కారణంగా ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాహనాలు నిలిచిపోయిన నేపథ్యంలో ప్రజా రవాణా పూర్తిగా స్థంభించిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రజలు నిత్యావసరాల కోసం బయటికి వెళ్లే పరిస్థితి కూడా సంక్లిష్టంగా మారింది.ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో, భారత్ పాక్షికంగా చేసిన సైనిక చర్యల ప్రభావం పాకిస్థాన్ లోపలున్న సామాజిక, ఆర్థిక వ్యవస్థలపైనా ఎలా పడుతోంది అనే దానికి ఇది ఓ ఉదాహరణగా మారుతోంది.