Asianet News TeluguAsianet News Telugu

వెరైటీ ఆలోచనతో డబ్బు సంపాదన:బంగ్లాదేశ్ వ్యక్తిపై కేసు నమోదు

జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటేందుకు  నిచ్చెన ఏర్పాటు చేసి ప్రయాణీకుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిపై  పోలీసులు కేసు నమోదు చేశారు.

Man Charges Money For Assisting People Cross Busy Highway In Dhaka With Help Of Ladder lns
Author
First Published Mar 23, 2024, 7:22 AM IST

ఢాకా: వినూత్నంగా ఆలోచించడం ద్వారా  డబ్బులు సంపాదించవచ్చని  ఓ వ్యక్తి ఆలోచించారు. ఇందుకు సంబంధించిన  వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  బంగ్లాదేశ్ లోని  ఢాకా-చిట్టగాంగ్ జాతీయ రహదారిని దాటేందుకు  ప్రయాణీకులు  దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది.

 అయితే జాతీయ రహదారిపై ఉన్న బారికేడ్లను దాటేందుకు చిన్న నిచ్చెనను ఏర్పాటు చేసి ప్రయాణీకులను ఓ వ్యక్తి రోడ్డు దాటిస్తున్నాడు. అయితే ఇలా బారికేడ్ల వద్ద నిచ్చెన సహాయంతో  రోడ్డు దాటిన వారి నుండి  కొంత నగదు వసూలు చేస్తున్నాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దరిమిలా పోలీసులు  ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని  స్థానిక మీడియా కథనాలు తెలుపుతున్నాయి. ఈ ఘటన ఈ నెల  17న చోటు చేసుకుంది.

బారికేడ్లు దాటిన తర్వాత  ప్రయాణీకులు నగదును ఇచ్చేందుకు  అక్కడే నిలబడ్డారు. జాతీయ రహదారిపై  వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయినా కూడ  రోడ్డుపైనే ఇదంతా జరుగుతుంది.  అయితే ఈ వ్యవహారాన్ని ఓ వ్యక్తి  రికార్డు చేసి  సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  

 

మలేషియా సన్ కథనం మేరకు  ఢాకా-చిట్టగాంగ్ హైవేపై  నారాయణగంజ్ షిమ్రైల్ క్రాస్ రోడ్డు  వద్ద  ఈ ఘటన చోటు చేసుకుంది. బారికేడ్ల  వద్ద నిచ్చెన ఏర్పాటు చేసి ప్రయాణీకులను రోడ్డు దాటించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 


 

Follow Us:
Download App:
  • android
  • ios