Asianet News TeluguAsianet News Telugu

లెబనాన్ పై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ ... 100 మంది మృతి, 400 మందికి గాయాలు 

లెబనాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి.  తాజాగా మారణహోమం చోటుచేసుకుందని లెబనాన్ అధికారులు వెల్లడించారు. 

Israel Airstrike on Lebanon: Over 100 Dead, 400 Injured in Devastating Attack AKP
Author
First Published Sep 23, 2024, 5:17 PM IST | Last Updated Sep 23, 2024, 5:36 PM IST

ఇజ్రాయోల్ దళాల వైమానిక దాడిలో లెబనాన్ అల్లకల్లోలంగా మారింది. ఈ దాడిలో ఇప్పటికే 100 మందికి పైగా మృతిచెందగా మరో 400 మంది గాయాలపాలయ్యారని లెబనాన్ అధికారులు ప్రకటించారు. గాయపడిన వారిలో చాలామంది ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఎయిర్ స్ట్రైక్ వల్ల చాలామంది నిరాశ్రయులు అయ్యారని లెబనాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

ఇక లెబనాన్ లో వైమానిక దాడులపై ఇజ్రాయెల్ కూడా స్పందించింది.  హెజ్బుల్లా గ్రూప్ కు చెందిన 300 కు పైగా స్థావరాలపై దాడులు చేసినట్లు ప్రకటించారు. ఈ దాడులు దక్షిణ లెబనాన్ లో జరిగాయి. దాడులకు ముందు హెజ్బుల్లా ఆయుధాలు నిల్వ చేసిన స్థావరాలు,  చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వెంటనే ఖాళీచేసి వెళ్లిపోవాలంటూ హెచ్చరించినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.  

ఇక గతవారం లెబనాన్ రాజధాని బీరుట్ లో ఓ భవనంపై దాడిచేసింది ఇజ్రాయెల్. హెజ్బుల్లా గ్రూప్ కు చెందిన కీలక సభ్యులు సమావేశం కాగా.... సమాచారం అందుకున్న ఇజ్రాయెల్ సైన్యం ఒక్కసారిగా దాడికి దిగింది. ఇందులో 16 మంది హెజ్బుల్లా కమాండర్లు మృతిచెందారు. ఈ దాడిలో హెజ్బుల్లా తీవ్రంగా గాయపడింది. అంతకుముందు పేజర్లు, వాకీటాకీల పేలుళ్లు కలకలం రేపింది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios