ఇండోనేషియా భూకంపం: 162 కు చేరిన మరణాలు, వందలాది మందికి గాయాలు
Jakarta: ఇండోనేషియాలో సంభవించిన భూకంపం కారణంగా చనిపోయిన వారి సంఖ్య 162కు చేరుకుంది. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇండోనేషియా " పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ " ను విస్తరించి ఉంది. ఇది భూకంపపరంగా అత్యంత చురుకైన జోన్.
Indonesia Earthquake: ఇండోనేషియాలోని వెస్ట్ జావా ప్రావిన్స్ లో సోమవారం సంభవించిన భారీ భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 162కు చేరుకుంది. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇండోనేషియా రాజధాని జకార్తాకు ఆగ్నేయంగా 75 కిలోమీటర్ల దూరంలోని పశ్చిమ జావాలోని సియాంజూర్ పట్టణానికి సమీపంలో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రాంతంలో దాదాపు 2.5 మిలియన్లకు పైగా ప్రజలు నివాసం ఉంటున్నారు.
భూకంపం కారణంగా ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 162కు చేరుకుందని వెస్ట్ జావా గవర్నర్ రిద్వాన్ కామిల్ ఇన్ స్టాగ్రామ్ లో తెలిపారు. అలాగే, గాయపడ్డవారి సంఖ్య వందల్లో ఉందని పేర్కొన్నారు. ఇండోనేషియా విపత్తు నివారణ సంస్థ (బీఎన్సీబీ) ఇప్పటికీ భూకంపంలో చనిపోయిన వారి సంఖ్య 62గా ఉందని పేర్కొంది. అయితే, శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్న మరో 25 మంది కోసం రెస్క్యూ సిబ్బంది వెతుకుతున్నారు. అలాగే, గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. తప్పిపోయిన వారి కోసం రాత్రి వరకు శోధన కొనసాగుతుందని చెప్పారు. భూకంపం కారణంగా ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో భవనాలు కూలిపోయాయి. దీంతో మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని ఆయన తెలిపారు. ఎందుకంటే శిథిలాల కింద పెద్ద సంఖ్యలో జనాలు చిక్కుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. "ఏకాంత ప్రదేశాలలో చిక్కుకున్న నివాసితులు ఉన్నారు ... కాబట్టి గాయపడిన వారితో పాటు మరణాల సంఖ్య కాలక్రమేణా పెరుగుతుందని మేము అంచనా వేస్తున్నాము" అని ఆయన తెలిపారు.
కాగా, ఇండోనేషియా "పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్" అని పిలవబడే అత్యంత భూకంప చురుకైన జోన్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ భూమి క్రస్ట్లోని వివిధ పలకలు నిత్యం కదలికలకు లోనవుతుంటాయి. దీని కారణంగా ఇండోనేషియాలో పెద్ద సంఖ్యలో భూకంపాలు, అగ్నిపర్వతాలను సృష్టిస్తాయి. తాజా భూకంపం కారణంగా పెద్ద సంఖ్యలో ప్రాణనష్టాన్ని కలిగించడంతో పాటు 2,200కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయనీ, 5,300 మందికి పైగా నిరాశ్రయులయ్యారని బీఎన్పీబీ తెలిపింది. రిద్వాన్ ఆ సంఖ్యను 13,000గా పేర్కొన్నారు. వారందరూ కూడా సియాంజూర్లోని వివిధ తరలింపు కేంద్రాలలో విస్తరించి ఉంటారని చెప్పారు. భూకంపం కారణంగా విద్యుత్తు నిలిచిపోయి, కమ్యూనికేషన్లకు అంతరాయం ఏర్పడిందన్నారు. కొండచరియలు విరిగిపడటంతో కొన్ని ప్రాంతాల్లో తరలింపులను అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. వందలాది మంది బాధితులు ఆసుపత్రి పార్కింగ్ స్థలంలో, మరికొందరు అత్యవసర టెంట్లో చికిత్స పొందుతున్నారు. సియాంజూర్లోని ప్రాంతాల్లో నివాసితులు బహిరంగ మైదానాల్లో లేదా గుడారాల్లో చాపలపై గుమికూడారు, వారి చుట్టూ ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.
వాతావరణ జియోఫిజిక్స్ ఏజెన్సీ (BMKG) ప్రకారం.. 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం వల్ల సంభవించిన నష్టాన్ని పూర్తి స్థాయిలో గుర్తించడానికి అధికారులు ఇంకా కృషి చేస్తున్నారు. కాగా, 2004లో, ఉత్తర ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం 14 దేశాలను తాకిన సునామీని ప్రేరేపించింది. హిందూ మహాసముద్ర తీరప్రాంతంలో 226,000 మంది మరణించారు. వారిలో సగానికి పైగా ఇండోనేషియాలో ఉన్నారు.