Asianet News TeluguAsianet News Telugu

Vinisha Umashankar: ప్రపంచ వేదికపై స్పీచ్‌తో అదరగొట్టిన భారతీయ బాలిక.. వీక్షించిన మోదీ, బైడెన్

అది ప్రపంచ వేదిక.. పలు దేశాల అధినేతలు హాజరయ్యారు.. అక్కడ 14 ఏళ్ల భారతీయ బాలిక ప్రసంగించింది. ఆమె ఉత్తేజకరమైన ప్రసంగాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వీక్షించారు. 

Indian Teen Vinisha Umashankar Powerful Speech in cop26
Author
Glasgow, First Published Nov 3, 2021, 12:51 PM IST

అది ప్రపంచ వేదిక.. పలు దేశాల అధినేతలు హాజరయ్యారు.. అక్కడ 14 ఏళ్ల భారతీయ బాలిక ప్రసంగించింది. ఆమె ఉత్తేజకరమైన ప్రసంగాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వీక్షించారు. ఇది గ్లాస్గో నగరంలో జరిగిన ఐకరాజ్య సమితి కాప్‌ 26 వాతావరణ సదస్సులో చోటుచేసుకుంది. భారత్‌లోని తమిళనాడుకు చెందిన 14 ఏళ్ల టీనేజర్ వినీషా ఉమాశంకర్ (Vinisha Umashankar).. ఎకో ఆస్కార్స్‌గా పిలువబడే ఎర్త్‌షాట్ ప్రైజ్ (Earthshot Prize) ఫైనలిస్ట్. ఆమెను వాతావరణ సదస్సులో క్లీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ గురించి చర్చించే సమావేశంలో మాట్లాడేందుకు ప్రిన్స్ విలియం ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వినీషా.. వాగ్దానాలు అమలు చేయని ప్రపంచ నాయకుల పట్ల తాము కోపంతో ఉన్నామని, వారిపట్ల విసుగు చెందామని  చెప్పారు. 

‘ఈ రోజు నేను అన్ని అడుగుతున్నాను.. మనం మాట్లాడటం మానేసి, చేయడం ప్రారంభించాలి. మేము.. ఎర్త్‌షాట్ ప్రైజ్ విజేతలం, ఫైనలిస్టులం.. మీరు శిలాజ ఇంధనాలు, పొగ, కాలుష్యంపై నిర్మించిన ఆర్థిక వ్యవస్థ కాకుండా..  మా ఆవిష్కరణలు, ప్రాజెక్ట్‌లు, పరిష్కారాలకు మద్దతు ఇవ్వాలి. మనం పాత చర్చల గురించి ఆలోచించడం మానేయాలి.. ఎందుకంటే కొత్త భవిష్యత్తు కోసం కొత్త దృష్టి అవసరం. కాబట్టి మీరు మా భవిష్యత్తును రూపొందించడానికి మీ సమయాన్ని, డబ్బును, కృషిని మాలో పెట్టుబడి పెట్టాలి’ అని వినీషా ప్రపంచ నాయకులను కోరారు. 

‘ది ఎర్త్‌షాట్ ప్రైజ్ విజేతలు, ఫైనలిస్టుల తరపున.. నేను మిమ్మల్ని మాతో చేరమని ఆహ్వానిస్తున్నాను. మీరు పాత ఆలోచనా విధానాలను, పాత అలవాట్లను వదులుకుంటారని ఆశిస్తున్నాము. అయితే మేము ఒక విషయం స్పష్టంగా చెప్తాం.. మాతో చేరమని మేము మిమ్మల్ని ఆహ్వానించాం.. మీరు లేకపోయినా మేము నాయకత్వం వహిస్తాం. మీరు గతంలోనే ఉండిపోయినప్పటికీ మేము భవిష్యత్తును నిర్మిస్తాము. అయితే దయచేసి నా ఆహ్వానాన్ని అంగీకరించండి, ఇలా చేయడం ద్వారా మీరు చింతించరని నేను మీకు హామీ ఇస్తున్నాను’ అని Vinisha Umashankar అన్నారు.

 

తాను కేవలం భారత్‌కు చెందిన అమ్మాయిని కాదు.. భూమి మీద ఒక అమ్మాయిని.. అలా ఉన్నందుకు గర్వపడుతున్నాను అని వినీషా అన్నారు. తాను విద్యార్థిని, ఆవిష్కర్తను, పర్యావరణవేత్తను, వ్యాపారవేత్తను.. ముఖ్యంగా ఆశావాదిని అని పేర్కొన్నారు.  ఇక, తమిళనాడులోని తిరువన్నమలైకి చెందిన వినీషా... సోలార్‌ ఎనర్జీతో పనిచేసే ఇస్త్రీపెట్టె బండిని డిజైన్‌ చేశారు. స్వీడన్‌కి చెందిన చిల్ట్రన్స్‌ క్లైమేట్ ఫౌండేషన్‌ రీసెంట్‌గా క్లీన్ ఎయిర్‌ కేటగిరిలో వినీషాకి చిల్డ్రన్స్‌ క్లైమేట్‌ ప్రైజ్‌  అందించింది. ఆ తర్వాత ఎర్త్​షాట్​ ప్రైజ్ ఫైనలిస్ట్‌గా నిలిచారు.

ప్రిన్స్ విలియం.. భూమి ఎదుర్కొంటున్న గొప్ప పర్యావరణ సవాళ్లకు అత్యంత ఉత్తేజకరమైన,  వినూత్న పరిష్కారాల కోసం ఎర్త్‌షాట్ ప్రైజ్‌ను ప్రపంచ శోధనగా రూపొందించబడింది. ఇది ప్రకృతిని ఎలా రక్షించాలి, పునరుద్ధరించాలి..?, మన గాలిని శుభ్రం చేయండి, మన మహాసముద్రాలను పునరుద్ధరించండి, వ్యర్థ రహిత ప్రపంచాన్ని నిర్మించండి,  మన వాతావరణాన్ని సరిచేయండి అనే అంశాలను కవర్ చేస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios