న్యూజిలాండ్ సమీపంలోని కెర్మాడెక్ దీవుల్లో సోమవారం భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.1గా నమోదు అయ్యింది. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం ఉందని యూఎస్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. 

న్యూజిలాండ్ సమీపంలోని కెర్మాడెక్ దీవుల్లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత మొదట 7.3గా నమోదు అయ్యిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) తెలిపింది. అయితే తరువాత 7.1కి తగ్గించింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు వార్తా సంస్థ ‘రాయిటర్స్’ నివేదించింది.

ఈత రాకపోయినా భార్య దూకిందనుకొని బావిలో దూకిన భర్త.. కానీ పొలంలోనే ఏడుస్తూ ఉన్న భార్య.. చివరికి ఏం జరిగిందంటే ?

ఈ భూకంపం వల్ల కెర్మాడెక్ దీవులకు సునామీ ముప్పు పొంచి ఉందని యూఎస్ సునామీ హెచ్చరిక కేంద్రం అంచనా వేసింది. కాగా.. గత నెలలో కెర్మాడెక్ దీవుల్లో రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. తాజా భూకంపం న్యూజిలాండ్‌ను ప్రభావితం చేస్తుందో లేదో అంచనా వేస్తున్నామని న్యూజిలాండ్ నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ పేర్కొంది. అయితే ఒక వేళ మళ్లీ బలమైన భూకంపం వచ్చినట్లయితే ప్రజలు తీర ప్రాంతాల నుండి దూరంగా వెళ్లాలని సూచించింది. 

విషాదం.. కైవల్యా నదిలో మునిగి ఇద్దరు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన

ఈ కెర్మాడెక్ దీవుల్లో రౌల్ ద్వీపం మినహా జనావాసాలు లేవు. న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు వాతావరణ పరిశీలనలు చేసేందుకు కొన్ని సార్లు ఈ ప్రాంతానికి వస్తుంటారు. మరికొన్ని సార్లు కలుపు నియంత్రణ పనలు చేయడానికి ప్రజలు వస్తుంటారు. అయితే ద్వీపాలు తరచుగా పెద్ద భూకంపాలకు గురవుతుంటాయి. 

Scroll to load tweet…

ఇదిలా ఉండగా.. మేఘాలయలోని సౌత్ గారో హిల్స్ ప్రాంతంలో కూడా ఆదివారం మధ్యాహ్నం భూకంపం వచ్చింది. మధ్యాహ్నం 3:33 గంటలకు 3.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ  నివేదించింది. అయితే ఇందులో ఎలాంట ప్రాణనష్టం సంభవించలేదు.