ఫ్రాన్స్లో '46 మ్యుటేషన్స్'తో కొత్త వేరియంట్.. 12 మందిలో గుర్తింపు...
ఇది కరోనా B.1.640.2గా శాస్త్రవేత్తలు నిర్థారించారు. ఇప్పటికే ఫ్రాన్స్ లో ఈ వేరియంట్ బారిన 12 మంది పడినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త వేరియంట్ లో 46 కొత్త మ్యుటేషన్ లు ఉన్నట్లు తెలుస్తోంది.
పారిస్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ Omicron కేసుల సంఖ్య పెరుగుతుండగానే మరోవైపు France లో మరో కొత్త కోవిడ్ వేరియంట్ కలకలం రేపుతోంది. ఫ్రాన్స్ లో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ New variant రకాన్ని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.
ఇది కరోనా B.1.640.2గా శాస్త్రవేత్తలు నిర్థారించారు. ఇప్పటికే ఫ్రాన్స్ లో ఈ వేరియంట్ బారిన 12 మంది పడినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త వేరియంట్ లో 46 కొత్త మ్యుటేషన్ లు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. భారత్ లోనూ కరోనా వైరస్ కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన తర్వాత దేశంలో కోవిడ్-19 కొత్త కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఒక్కరోజే 37 వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదుకావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
మంగళవారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన కరోనా వైరస్ వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 37,379 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ కేసులు 3,49,60,261 కు చేరాయి. క్రియాశీల కేసులు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 1,71,830 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 11 వేల మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోవిడ్-19 రికవరీల సంఖ్య 3,43,06,414కు పెరిగింది. దాదాపు 117 రోజుల తర్వాత అత్యధికంగా ఒకరోజు కోవిడ్ కేసులు ఇవేనని గణాకాంలు పేర్కొంటున్నాయి.
Omicron: ఒమిక్రాన్ టెన్షన్.. ఈ ఏడాది ముగిసే కల్లా.. డబ్ల్యూహెచ్వో కీలక వ్యాఖ్యలు !
అలాగే, గత 24 గంటల్లో కరోనా మహమ్మారితో పోరాడుతూ 124 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్త కరోనా మరణాల సంఖ్య 4,82,071 చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 98.2 శాతంగా ఉంది. మరణాల రేటు 1.38 శాతంగా ఉంది. అయితే, కరోనా పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా వారంతపు పాజిటివిటీ రేటు 5.1 శాతంగా ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
ఈ క్రమంలోనే కరోనా కట్టడి కోసం కఠిన చర్యలు సైతం తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియతో పాటు పరీక్షల్లో వేగం పెంచారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 68,09,50,476 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. సోమవారం ఒక్కరోజే 8,78,990 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది.
ఇదిలావుండగా, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం ముమ్మరంగా కొనసాగుతోంది. సోమవారం నుంచి ప్రభుత్వం 15 నుంచి 18 ఏండ్ల వయస్సు ఉన్న వారికి సైతం టీకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 146.3 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్రం వెల్లడించింది. ఇందులో రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 61.4 కోట్లకు పెరిగింది. మొదటి డోసు అందుకున్న వారు 84.9 కోట్ల మంది ఉన్నారు.