భారత్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఎలాంటి పరిణామాలు సృష్టిస్తోందో ప్రపంచం చూస్తోంది. అయితే మనదేశంతో పాటు పలు దేశాల్లోనూ కొత్త స్ట్రెయిన్లు వెలుగులోకి వస్తున్నాయి. తొలి దశ కోవిడ్ కంటే ఈ మ్యూటేషన్లు ఎన్నో రెట్లు ప్రమాదకరమమైనవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భారత్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఎలాంటి పరిణామాలు సృష్టిస్తోందో ప్రపంచం చూస్తోంది. అయితే మనదేశంతో పాటు పలు దేశాల్లోనూ కొత్త స్ట్రెయిన్లు వెలుగులోకి వస్తున్నాయి. తొలి దశ కోవిడ్ కంటే ఈ మ్యూటేషన్లు ఎన్నో రెట్లు ప్రమాదకరమమైనవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తాజాగా శ్రీలంకలో మరింత ప్రమాదకరమైన కొత్తరకం కరోనాను (కొత్త స్ట్రెయిన్ను) గుర్తించారు. ఇది లంకలో ఇప్పటిదాకా గుర్తించిన స్ట్రెయిన్ల కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.
Also Read:బహిరంగ ప్రదేశాల్లో మాస్కు పెట్టుకోనక్కరలేదు.. ఎక్కడంటే
గంట వరకు ఈ వైరస్ గాలిలో ఉంటోందని నిర్ధారించారు. శ్రీలంకలో గత వారం జరిగిన నూతన సంవత్సరం వేడుకల తర్వాత నుంచి కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉందని ఆరోగ్య శాఖ తెలిపారు. ముఖ్యంగా యువత ఎక్కువగా దాని బారిన పడుతున్నారు.
వచ్చే 2 వారాల్లో కరోనా మూడో దశ ఉద్ధృతికి దారితీయవచ్చని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. తుంపర్లలో కరోనా కొత్త స్ట్రెయిన్ గంట వరకు గాలిలో ఉంటున్నదని గుర్తించామని శ్రీలంక ఇమ్యునాలజీ, మాలిక్యులర్ సైన్సెస్ విభాగం చీఫ్ . ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి శ్రీలంక ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
