Asianet News TeluguAsianet News Telugu

‘అతిగా నీటిని తాగడం వల్లే బ్రూస్ లీ మరణించాడు’.. తాజా అధ్యయనం..

మార్షల్ ఆర్ట్స్‌ను ప్రసిద్ధ సంస్కృతిలోకి తీసుకురావడంలో సహాయపడిన 'ఎంటర్ ది డ్రాగన్' నటుడు జూలై 1973లో 32 ఏళ్ల వయసులో మరణించాడు.

Bruce Lee May Have Died From Drinking Too Much Water, Claims Study
Author
First Published Nov 22, 2022, 11:40 AM IST

అమెరికన్ మార్షల్ ఆర్ట్స్ లెజెండ్, నటుడు బ్రూస్ లీ ఎక్కువ నీరు తాగడం వల్ల మరణించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో పేర్కొన్నారు. బ్రూస్ లీ 1973, జూలైలో 32 సంవత్సరాల వయస్సులో మెదడు వాపు, సెరిబ్రల్ ఎడెమాతో మరణించాడు. 'ఎంటర్ ది డ్రాగన్' సినిమా ద్వారా మార్షల్ ఆర్ట్స్‌ను పాపులర్ కల్చర్ లోకి తీసుకువచ్చిన నటుడు, మార్షల్ ఆర్టిస్ట్ బ్రూస్లీ. చనిపోవడానికి కారణమైన మెదడువ్యాపుకు కారణం పెయిన్ కిల్లర్స్ అని వైద్యులు విశ్వసించారు.

ఎడెమా, పరిశోధకుల బృందం ప్రకారం, హైపోనాట్రేమియా ద్వారా వచ్చింది. క్లినికల్ కిడ్నీ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనంలో, బ్రూస్ లీ మూత్రపిండాలు ఎక్కువైన నీటిని తొలగించలేకపోయినందువల్లే మరణించినట్లు పరిశోధకులు ప్రతిపాదించారు. ఇప్పటివరకు బ్రూస్ లీ మరణం మీద అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్స్ హత్య చేశారని, విషప్రయోగం జరిగిందని, శాపం తగిలిందని, వడదెబ్బవల్ల చనిపోయాడని.. ఇలా రకరకాలుగా ప్రచారంలో ఉంది. అయితే ఇప్పుడు తాజాగా పరిశోధనలో బయటపడిన విషయాలు దీనికి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. 

‘దొంగ’తెలివి.. ఉబర్ కాబ్ లో వచ్చి. బ్యాంకు దోచేసి.. మళ్లీ అదే క్యాబ్ లో వెళ్లి...

శాస్త్రవేత్తల ప్రకారం, నటుడు హైపోనాట్రేమియాతో మరణించి ఉండొచ్చు,ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరంలోని సోడియం స్థాయిలు పడిపోయినప్పుడు ఈ పరిస్తితి ఏర్పడుతుంది. శరీరంలోని కణాలు, ముఖ్యంగా మెదడులోని కణాలు ఈ అసమతుల్యత ఫలితంగా ఉబ్బుతాయి. అధికంగా ద్రవాలు తీసుకోవడం, గంజాయి వాడకం లాంటి దాహాన్నిపెంచే అలవాట్లతో నీటిని విసర్జించే మూత్రపిండాల సామర్థ్యాన్ని బలహీనపడడానికి దారితీశాయి. వీటితో పాటు ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ వాడకం, ఆల్కహాల్ వినియోగం వంటివి కూడా బ్రూస్లీలో హైపోనాట్రేమియాకు ప్రమాద కారకాలు ఉన్నాయని పరిశోధకులు వాదించారు. 

చివరగా.. శాస్త్రవేత్తలు  "బ్రూస్ లీ ఒక నిర్దిష్ట మూత్రపిండ పనిచేయకపోవడం వల్ల మరణించాడని మేము ఊహిస్తున్నాం.. నీటి హోమియోస్టాసిస్‌ను నిర్వహించడానికి తగినంత నీటిని విసర్జించలేకపోవడం, వల్ల మూత్రనాళాలు పనిచేయకుండా పోతాయి.".. "ఇది హైపోనాట్రేమియా, సెరిబ్రల్ ఎడెమా (మెదడు వాపు) మూత్రంలో నీటి విసర్జనతో సరిపోలకపోతే గంటల్లో మరణానికి దారితీయవచ్చు, ఇది లీ మరణం సమయంలో జరిగి ఉంటుంది" అని వారు కొనసాగించారు.

లీ భార్య లిండా లీ కాడ్వెల్ ఒకసారి అతని "క్యారెట్, యాపిల్ జ్యూస్" ద్రవ ఆధారిత ఆహారం గురించి ప్రస్తావించారు. బ్రూస్ లీ రోజువారీ నీటి వినియోగం గురించి 2018 పుస్తకం "బ్రూస్ లీ : ఎ లైఫ్" రచయిత మాథ్యూ పాలీ తరచుగా ప్రస్తావించారు, ముఖ్యంగా లీ అనారోగ్యానికి గురయ్యే ముందు, న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. 

"ఆ సమయంలో అతను నీళ్లు కావాలని అడిగాడు.. అతను కొద్దిగా అలసిపోయాడు. దాహం వేస్తుందన్నాడు. కొంచెం నీరు తాగిన తరువాత తర్వాత మైకంలోకి వెల్లినట్టు అనిపించాడు. తలనొప్పి వస్తుందని చెప్పి వెంటనే మూర్ఛపోయాడు" అని రచయిత ఓ పుస్తకంలో రాశారు. విచిత్రం ఏంటంటే.. 'బి వాటర్ మై ఫ్రెండ్' అనే కోట్‌ని బ్రూస్ లీ తరచుగా చెబుతుండేవాడు. కానీ, ఈ ఎక్కువైన నీరేఅతనిని చంపినట్లు కనిపిస్తుంది" అని పరిశోధకులు తేల్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios