తాలిబన్ల చేతిలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లో బాంబు దాడులు ఆగడం లేదు. ఇటీవల ఈ దాడులు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా రాజధాని కాబూల్ లో ఓ బస్సుపై బాంబు దాడి జరిగింది. దీంతో నలుగురు చనిపోయారు. పలువురికి గాయాలు అయ్యాయి.
ఆఫ్ఘనిస్తాన్ రాజధానిలో కాబూల్ మినీ బస్సుపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనతో దేశం మొత్తం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. ఈ దాడిలో నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. గత కొన్ని నెలలుగా ఆఫ్ఘనిస్తాన్ ను బాంబు దాడులు కుదిపేస్తున్నాయి. అయితే కొంత సమయం గ్యాప్ తరువాత మళ్లీ ఇక్కడ బాంబు పేలుడు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
కారులో శృంగారం.. బీమా కంపెనీకి షాక్.. రూ. 40 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని తీర్పు
ఈ పేలుడుపై దర్యాప్తు కోసం తాలిబన్ భద్రతా సిబ్బందిని ఘటనా స్థలానికి పంపినట్లు పోలీసు అధికార ప్రతినిధి ఖలీద్ జాద్రాన్ ఏఎఫ్ పీ వార్తా సంస్థతో చెప్పారు. ఈ దాడి ప్రధానంగా సున్నీ పష్తూన్ కమ్యూనిటీ సభ్యులు నివసించే జిల్లాలో జరిగింది. అయితే ఈ బాంబు పేలుళ్లకు ఏ గ్రూపు బాధ్యత వహిస్తుందో ఇంకా తెలియరాలేదు.
ఆగస్టులో తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటి నుండి, దేశవ్యాప్తంగా బాంబు దాడులు తగ్గాయి. కానీ దాడులు ఇటీవల కాలంలో పెరిగాయి. ఏప్రిల్ 30న ముగిసిన రంజాన్ సందర్భంగా కాబూల్, ఇతర ఆఫ్ఘన్ నగరాల్లో డజన్ల కొద్దీ పౌర మరణాలు సంభవించాయి. షియా హజారస్, సూఫీ కమ్యూనిటీలు ఈ దాడులలో అనేకం టార్గెట్ గా ఉన్నాయి. కొన్ని స౦దర్భాల్లో మార్కెట్ల ను౦చి లేదా ఆఫీసుల ను౦చి ప్రయాణీకులను వారి నివాసాలకు తీసుకువెళ్ళే మినీబస్సులపై బాంబుల దాడులు జరిగాయి.
రెస్టారెంట్లో భోజనం చేస్తుంటే మహిళలమీద దాడి.. కిందపడేసి దారుణంగా కొట్టిన 8మంది అరెస్ట్...
కానీ ఉత్తర నగరమైన కుందుజ్ లో జరిగిన బాంబు దాడిలో రంజాన్ సందర్భంగా జరిగిన దాడిలో చాలా మంది చనిపోయారు. అక్కడ సూఫీ ఆరాధకులను టార్గెట్ గా చేసుకొని ఏప్రిల్ 22న ఓ బాంబు ఒక మసీదును ధ్వంసం చేసింది. ఈ పేలుడులో దాదాపు ౩౩ మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. అలాగే మే 25న బాల్ఖ్ ప్రావిన్స్ రాజధానిని వణికించిన మూడు పేలుళ్లలో కనీసం తొమ్మిది మంది మరణించగా 15 మంది గాయపడ్డారు. అదే రోజు కాబూల్ నగరంలోని మసీదు షరీఫ్ హజ్రత్ జకారియా మసీదులో జరిగిన పేలుడు జరిగింది. ఈ ఘటనలో దాదాపు ఇద్దరు భక్తులు మరణించారు.
Saharanpur violence: సహరన్పూర్ హింస ఘటన.. నిందితుల అక్రమ ఆస్తుల కూల్చివేత.. 64 మంది అరెస్టు..
ఆఫ్ఘనిస్తాన్ లో మహిళలు, మానవ హక్కుల కోసం నినదించే యూఎస్ ప్రత్యేక రాయబారి రీనా అమిరి, బాల్ఖ్.. ఈ కాబూల్ లో జరిగిన దాడులపై స్పందించారు. ప్రజల భద్రతను నిర్ధారించాలని, దౌర్జన్యాలను నివారించాలని తాలిబాన్లకు పిలుపునిచ్చారు. ‘‘మజార్, కాబూల్ లో జరిగిన ఘోరమైన దాడులు ఇప్పటికే నష్టపోయిన అమాయక ఆఫ్ఘన్లను మరింత వినాశనానికి గురి చేస్తాయి తప్ప మరే ప్రయోజనాన్ని చేకూర్చదు.’’ అని అమీరి ట్వీట్ చేశారు. ‘‘ ఈ భయంకరమైన దాడులను నివారించడం, ఆఫ్ఘన్ల భద్రత, అవసరాలను తీర్చడంపై తాలిబాన్లు దృష్టి సారించాలి ’’ అని పేర్కొన్నారు.