Asianet News TeluguAsianet News Telugu

ప‌రీక్ష విధుల్లో ఉండ‌గా ముష్క‌రుల కాల్పులు.. 8 మంది ఉపాధ్యాయులు మృతి

Eight school teachers shot dead: ప‌రీక్ష‌ల విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల‌పై ముష్క‌రులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. దాడి జరిగిన ప్రాంతం నుంచి ముష్కరులు పారిపోయారని, దీనికి తామే బాధ్యులమని ఏ గ్రూపు ప్రకటించుకోలేదని అధికార వ‌ర్గాలు  తెలిపాయి.

At least 8 killed, teachers shot dead while on examination duty in Pakistan  RMA
Author
First Published May 5, 2023, 12:04 AM IST

Terrorist attacks targeted at teachers: ప‌రీక్ష‌ల విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల‌పై ముష్క‌రులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఏనిమిది మంది ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులు పాకిస్థాన్ లో జ‌రిగాయి. అప్ప‌ర్ కుర్రం గిరిజన జిల్లాలోని తేరీ మెంగల్ హైస్కూల్ పై ముష్కరులు దాడి చేసి పరీక్ష విధుల్లో ఉన్న ఏడుగురు ఉపాధ్యాయులను హతమార్చారు. దాడి జరిగిన ప్రాంతం నుంచి ముష్కరులు పారిపోయారని, దీనికి తామే బాధ్యులమని ఏ గ్రూపు ప్రకటించుకోలేదని అధికార వ‌ర్గాలు  తెలిపాయి. ఇదే జిల్లాలో జరిగిన మరో ఘటనలో మరో ఉపాధ్యాయుడు కూడా మృతి చెందాడు.

వివ‌రాల్లోకెళ్తే.. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న పాకిస్థాన్ లోని వాయవ్య గిరిజన జిల్లాలో గురువారం జరిగిన రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఎనిమిది మంది పాఠశాల ఉపాధ్యాయులు మృతి చెందారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని ఎగువ కుర్రం గిరిజన జిల్లా పరచినార్ ప్రధాన కార్యాలయంలోని షాలోజాన్ రోడ్డులో తేరీ మెంగల్ తెగ (సున్నీ తెగ)కు చెందిన మహ్మద్ షరీఫ్ అనే పాఠశాల ఉపాధ్యాయుడి కారుపై గుర్తుతెలియని దుండగులు దాడి చేయడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అలాగే, అదే జిల్లాలోని ప్రభుత్వ తేరీ మెంగల్ హైస్కూల్ స్టాఫ్ రూమ్ లోకి చొరబడి టోరీ తెగ (షియా తెగ)కు చెందిన ఏడుగురు ఉపాధ్యాయులను ముష్క‌రులు హతమార్చారు.

ఉపాధ్యాయులందరూ తమ పరీక్ష విధులు నిర్వర్తించడానికి పాఠశాలలో ఉన్నారు. దాడి అనంతరం దుండగులు పరారయ్యారు. ఈ దాడులకు ఏ గ్రూపు లేదా వ్యక్తి బాధ్యత వహించలేదు, కానీ ఈ ప్రాంతం సున్నీలు- షియాల మధ్య మతపరమైన ఘర్షణలకు కేంద్రంగా ఉంది. జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. హత్యల అనంతరం 9, 10 తరగతుల కోహత్ బోర్డు పరీక్షను కూడా వాయిదా వేశారు. ఏడుగురు ఉపాధ్యాయుల హత్య కేసులో నిందితులను అరెస్టు చేసే వరకు అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ఆల్ ఖుర్రం టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ జాహిద్ హుస్సేన్ తెలిపారు. హంతకులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని ప్రఖ్యాత తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) కమాండర్ అబ్దుల్ జబర్ షాతో పాటు మరో ఇద్దరిని పాకిస్తాన్ భద్రతా దళాలు హతమార్చి, అనేక కీలక అరెస్టులు చేసిన రెండు రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనను ఖండించిన అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ త్వరలోనే నిందితులను అరెస్టు చేసి చట్టప్రకారం శిక్షిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కో-చైర్మన్, మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కూడా ఈ ఘటనను ఖండించారు. దాడి చేసిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలావుండ‌గా, ఉత్తర వజీరిస్థాన్ గిరిజన జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు సైనికులు, ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios