Asianet News TeluguAsianet News Telugu

బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం: 15 మంది మృతి, పలువురికి గాయాలు


బంగ్లాదేశ్ లో ఇవాళ ఘోర రైలు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో  15 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

At least 15 dead, over 100 injured in Bangladesh train collision lns
Author
First Published Oct 23, 2023, 6:02 PM IST


ఢాకా:బంగ్లాదేశ్ లో  సోమవారంనాడు  రైలు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో  15 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.ఇవాళ  సాయంత్రం  04:15 గంటల సమయంలో కిషోర్ గంజ్ నుండి ఢాకాకు వెళ్తున్న ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటివరకు  సుమారు 15 మృతదేహలను  వెలికితీశారు. ఈ ప్రమాదంలో దెబ్బతిన్న కోచ్ ల కింద చాలా మంది చిక్కుకున్నారని స్థానిక మీడియా  బీడీ న్యూస్24 ప్రకటించింది.

ఇవాళ  సాయంత్రం  04:15 గంటల సమయంలో కిషోర్ గంజ్ నుండి ఢాకాకు వెళ్తున్న ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటివరకు  సుమారు 15 మృతదేహలను  వెలికితీశారు. ఈ ప్రమాదంలో దెబ్బతిన్న కోచ్ ల కింద చాలా మంది చిక్కుకున్నారని స్థానిక మీడియా  బీడీ న్యూస్24 ప్రకటించింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు  80 కి.మీ. దూరంలో ఈ ప్రమాదం జరిగింది.ఢాకా వెళ్లే గోధూలి ఎక్స్ ప్రెస్ రైలు, ఛటోగ్రామ్ కు వెళ్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది.  

ఈ ప్రమాదం తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాలకు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటి వరకు  15 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని  అధికారులు  తెలిపారని స్థానిక మీడియా తెలిపింది. రైలు కోచ్ లకింద  పలువురు చిక్కుకుపోయినట్టుగా  అధికారులు అనుమానిస్తున్నారు.  ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios