రష్యాలోని బష్కోర్టోస్థాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో 11 మంది వృద్దులు సజీవదహనమయ్యారు. మంగళవారం నాడు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకొంది.
మాస్కో: రష్యాలోని బష్కోర్టోస్థాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో 11 మంది వృద్దులు సజీవదహనమయ్యారు. మంగళవారం నాడు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకొంది.
బష్కోర్టోస్థాన్లోని ఇషుబుల్డినో గ్రామంలోని ప్రైవేట్ రిటైర్మెంట్ హోంలో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ప్రమాద సమయంలో ఈ భవనంలో 15 మంది వృద్ధులున్నారు.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు బయటపడ్డారు. 11 మంది ఈ అగ్నికి సజీవ దహనమయ్యారు. అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పాయి.
ఈ భవనంలో అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పురాతన భవనాల్లో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఈ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 15, 2020, 6:26 PM IST