Asianet News TeluguAsianet News Telugu

టర్కీలో 7.8 తీవ్రతతో భూకంపం... ఐదుగురు మృతి, అనేక భవనాలు ధ్వంసం...

దక్షిణ టర్కీలోని గాజియాంటెప్ సమీపంలో సోమవారం 7.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వీస్ తెలిపింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 5గురు మృతి చెందినట్లు సమాచారం.

7.8-Magnitude Powerful Earthquake Hits Turkey - bsb
Author
First Published Feb 6, 2023, 7:37 AM IST

ఇస్తాంబుల్ : దక్షిణ టర్కీలోని గాజియాంటెప్ సమీపంలో సోమవారం 7.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వీస్ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 04:17 గంటలకు 17.9 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ఇప్పటివరకు 5గురు మృతి చెందినట్లు సమాచారం. 34 భవనాలు ధ్వంసమయ్యాయని గవర్నర్ ఎర్డింక్ యిల్మాజ్ తెలిపారు. 

స్థానిక కాలమానం ప్రకారం ఫిబ్రవరి 6, 2023, సోమవారం తెల్లవారుజామున 4:17 గంటలకు టర్కీలోని గాజియాంటెప్ సమీపంలో 24.1 కి.మీ లోతులో భూకంపం సంభవించింది. ఈ భూకంపం ఖచ్చితమైన పరిమాణం, భూకంప కేంద్రం, లోతు మొదలైన వివరాలను తదుపరి కొన్ని గంటలు లేదా నిమిషాల్లో సవరిస్తామని.. మిగతా ఏజెన్సీల భూకంప శాస్త్రవేత్తలు డేటాను సమీక్షించిన తరువాత ఖచ్చితమైన నిర్థారణకు వస్తారని సమాచారం.

భూకంపానికి సంబంధించి రెండవ నివేదికను జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ జారీ చేసింది, దీని ప్రకారం భూకంప తీవ్రత 7.4గా తెలిపింది. ఇదే భూకంపాన్ని నివేదించిన ఇతర ఏజెన్సీలలో ఫ్రాన్స్‌కు చెందిన రిసో నేషనల్ డి సర్వైలెన్స్ సిస్మిక్ తీవ్రత 7.0, సిటిజన్-సీస్మోగ్రాఫ్ నెట్‌వర్క్ ఆఫ్ రాస్‌ప్బెర్రీ షేక్ 7.7, సిటిజన్-సీస్మోగ్రాఫ్ నెట్‌వర్క్ ఆఫ్ రాస్‌ప్బెర్రీ షేక్  సీస్మోగ్రాఫ్ నెట్‌వర్క్, సీస్మోగ్రాఫ్-7.8, యూరోపియన్ సెంటర్ పరిమాణం 7.6 గా తెలిపాయి. 

సాధారణంగా ఈ పరిమాణంలో సంభవించే భూకంపాలు ఒకటి కంటే ఎక్కువ ఏజెన్సీలచే నమోదు చేయబడతాయి. దీనివల్ల ఫలితాలు మారవచ్చు, మొదటి దాని తర్వాత వచ్చే తదుపరి నివేదికలు తరచుగా మరింత ఖచ్చితత్వాన్ని చూపుతాయి. తీవ్రత, లోతు గురించిన ప్రాథమిక సమాచారం సరిగ్గా ఉన్నట్లైతే ఈ భూకంపం చాలా ప్రమాదకరమైనది. ఇది స్థానిక ప్రజలు, అవస్థాపనపై  తీవ్ర విపత్తు ప్రభావాలను కలిగిస్తుంది. ముఖ్యంగా భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రాంతాలలో తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఈ భూకంప తీవ్రత వల్ల సమీపంలోని పట్టణాలు లేదా నగరాల్లో బలమైన భూప్రకంపనలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. 

ఇస్తాంబుల్ ప్రభుత్వ విపత్తు నిర్వహణ సంస్థ AFAD ప్రకారం, భూకంప తీవ్రత 7.4 గా ఉంది. మొదటి భూకంపం వచ్చిన 15 నిమిషాల తర్వాత 6.7 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్లు USGS నివేదించింది.

గాజియాంటెప్ దక్షిణ ప్రాంతం.. టర్కీ కీలక పారిశ్రామిక తయారీ కేంద్రాలలో ఒకటి. ఇది సిరియా సరిహద్దులో ఉంది. ఈ భూకంపం వల్ల లెబనాన్, సిరియా, సైప్రస్‌లలో ప్రకంపనలు సంభవించాయని ఏఎఫ్ పి ప్రతినిధులు తెలిపారు. కాగా దీనివల్ల ఇప్పటివరకు ఎటువంటి మరణాలు, క్షతగాత్రులకు సంబంధించిన వివరాలను టర్కీ అధికారులు ఇంకా నివేదించలేదు. అయితే సోషల్ నెట్‌వర్క్‌లలో పోస్ట్ చేయబడిన వీడియోలు దేశంలోని ఆగ్నేయంలోని అనేక నగరాల్లో ధ్వంసమైన భవనాలు కనిపిస్తున్నాయి. 

టర్కీ ప్రపంచంలో అత్యంత చురుకైన భూకంప జోన్లలో ఒకటి. 1999లో 7.4-తీవ్రతతో సంభవించిన భూకంపంలో దెబ్బతిన్న ప్రాంతాలలో డజ్స్ ఒకటి. ఇది దశాబ్దాలలో టర్కీని తాకిన అత్యంత ఘోరమైన భూకంపం. ఆ భూకంపంలో ఇస్తాంబుల్‌లో దాదాపు 1,000 మందితో ఇస్తాంబుల్ వాసులతో సహా 17,000 మందికి పైగా మరణించింది. పెద్ద భూకంపం ఇస్తాంబుల్‌ను నాశనం చేయగలదని నిపుణులు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు, 

2020 జనవరిలో ఎలాజిగ్‌లో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించి 40 మందికి పైగా మరణించారు. అదే సంవత్సరం అక్టోబర్‌లో, ఏజియన్ సముద్రంలో 7.0 తీవ్రతతో సంభవించిన భూకంపం 114 మందిని బలితీసుకుంది. 1,000 మందికి పైగా గాయపడ్డారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios