Asianet News TeluguAsianet News Telugu

ఆరెంజ్ జెర్సీలో టీం ఇండియా.. ఫోటోలు విడుదల

టీం ఇండియా క్రికెటర్లు ఆరెంజ్ కలర్ జెర్సీలో మెరిసిపోతున్నారు.  ప్రపంచకప్ లో భాగంగా రేపు( ఆదివారం) ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ తో టీంఇండియా తలపడనున్న సంగతి తెలిసిందే. 

World Cup 2019: Team India 'ready to rumble' vs England in new orange jersey
Author
Hyderabad, First Published Jun 29, 2019, 12:35 PM IST

టీం ఇండియా క్రికెటర్లు ఆరెంజ్ కలర్ జెర్సీలో మెరిసిపోతున్నారు.  ప్రపంచకప్ లో భాగంగా రేపు( ఆదివారం) ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ తో టీంఇండియా తలపడనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఆరెంజ్ కలర్ జెర్సీలో బరిలోకి దిగనున్నారు ఈ నేపథ్యంలో న్యూ జెర్సీ ఎలా ఉంటుందో అభిమానులకు ముందుగానే తెలియజేశారు. నూతన జెర్సీలను ధరించిన క్రికెటర్లు.. వాటితో ఫోటోలు కూడా దిగారు. ఆ ఫోటోలను క్రికెట్ వరల్డ్ కప్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.

ఇప్పటి వరకు బ్లూ జెర్సీతోనే సత్తా చాటిన భారత్ సడెన్ గా జెర్సీ మార్చుకోవడానికి రీజన్ ఉంది. భారత్, ఇంగ్లాండ్ ఈ రెండు జట్ల జెర్సీలు ఒకే రంగులో ఉంటాయి. దీంతో వీక్షకులు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎవరో ఒకరు తమ జెర్సీని మార్చుకోవాలి. అయితే.. ఇంగ్లాండ్.. ఆతిథ్య జట్టుకాబట్టి వాళ్లు జెర్సీ మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో టీం ఇండియానే జెర్సీ మార్చుకుంది. ఆరెంజ్, ముదురు నీలం రంగు కాంబినేషన్ లో ఉన్న ఈ జెర్సీలో ఆటగాళ్లు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. 


 

Follow Us:
Download App:
  • android
  • ios