ఆ వీడియో చూసి నా భార్య ఏడ్చేసింది.. సర్ఫరాజ్
తనను ఓ అభిమాని తిట్టడం తన భార్యకు బాధకలిగించిందని పాకిస్తాన్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అన్నారు. ఇటీవల ప్రపంచకప్ లో భాగంగా భారత్-పాక్ జట్లు పోటీపడ్డాయి.
తనను ఓ అభిమాని తిట్టడం తన భార్యకు బాధకలిగించిందని పాకిస్తాన్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అన్నారు. ఇటీవల ప్రపంచకప్ లో భాగంగా భారత్-పాక్ జట్లు పోటీపడ్డాయి. కాగా... ఈ మ్యాచ్ లో పాక్ ఓడిపోయింది. ఈ ఘటన ఆ జట్టు అభిమానులను ఎంతగానో బాధించింది. ఈ క్రమంలో పాక్ క్రికెటర్లను విపరీతంగా ట్రోల్ చేశారు.
ఈ మ్యాచ్ అనంతరం సర్ఫరాజ్ ఓ మాల్ లో తన కుమారుడితో వెళ్తుంటే... ఓ అభిమాని సర్ఫరాజ్ను ఉద్దేశిస్తూ ‘పందిలా బలుస్తున్నావ్ ఏంటి సంగతి’ అని వాగాడు. దీన్నేమీ పట్టించుకోని సర్ఫరాజ్ తన దారి చూసుకున్నాడు. ఈ వీడియో సామాజిక సైట్లో చూసిన అతని భార్య ఖుష్భక్త్ ఏడ్చేసిందంట. దీంతో...సర్ఫరాజ్ ఆమెను ఓదార్చారట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.
ఇదిలా ఉంటే... భారత్ పై ఓటమి తర్వాత పాక్ జట్టు పుంజుకుంది. భారత్ చేతిలో ఓడటంతో సర్వత్రా విమర్శలెదుర్కొన్న పాక్ వరుస మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్పై జయభేరి మోగించింది. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ట్విట్టర్లో ‘జట్టుకు అభినందనలు. టోర్నీలో పుంజుకున్న తీరు అద్భుతం. ముఖ్యంగా బాబర్ ఆజమ్, హారిస్ సొహైల్, షాహిన్ చక్కగా రాణించారు’ అని ట్వీట్ చేశారు.