Asianet News TeluguAsianet News Telugu

తాగిన మత్తులో కూతురిని గొంతు నులిమి చంపిన తండ్రి

మద్యం మత్తులో దుర్గారావు అనే వ్యక్తి హైదరాబాదులోని ఎల్బీ నగర్ లో తన ఐదేళ్ల కూతురిని గొంతు నులిమి హత్య చేశాడు. భార్య ఇంట్లో లేని సమయంలో అతను ఈ దారుణానికి ఒడిగట్టాడు.

Dad kills daughter in at LB Magar in Hyderabad
Author
L. B. Nagar, First Published Jan 11, 2020, 12:21 PM IST

హైదరాబాద్: హైదరాబాదులోని ఎల్బీ నగర్ లో అత్యంత అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. తాగిన మత్తులో ఓ తండ్రి తన కన్నకూతురిని హత్య చేశాడు. దుర్గారావు అనే వ్యక్తి తాగి వచ్చి తన ఐదేళ్ల కూతురు యామినిని గొంతు నులిమి చంపేశాడు. 

భార్య ఇంట్లో లేని సమయంలో దుర్గారావు ఈ దారుణానికి ఒడిగట్టాడు. దుర్గారావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. ఎల్బీ నగర్ లోని బాలాజీ నగర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది.

వివరాలు అందాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios