ఓ మహిళ ర్యాష్ డ్రైవింగ్ ఇంటి బయటకు ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలపైకి తెచ్చింది.
హైదారబాద్: ఓ మహిళ నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇద్దరు చిన్నారుల ప్రాణాలమీదకు తెచ్చింది. ఇంటి బయటకు ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపైకి దూసుకెళ్లిన కారు భీభత్సం స్రుష్టించింది. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది.
పాతబస్తీలోని మిశ్రీగంజ్లో ఇద్దరు చిన్నారులు ఇంటి బయట ఆడుకుంటుండగా వారిపైకి ఓ కారు దూసుకొచ్చింది. ఓ మహిళ నిర్లక్ష్యంగా కారు డ్రైవింగ్ చేస్తూ ఈ ప్రమాదానికి కారణమయ్యింది. కారు కింద పడి ఓ చిన్నారి రెండు కాళ్లు విరిగిపోయాయి. అయితే ఈ ప్రమాదం నుండి మరో బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. గాయపడిన బాలున్ని కుటుంబసభ్యులు దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదానికి కారణమైన మహిళ ఇటీవలే యూఏఈ నుండి వచ్చినట్లు తెలుస్తోంది. కారును రివర్స్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 18, 2020, 10:56 AM IST