Asianet News TeluguAsianet News Telugu

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొత్తు వారితోనే...: ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ రెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుంటుందని ప్రచారం జరుగుతున్న సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ రెడ్డి ఈ విషయంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

YSRCP MLA Gudiwada Amarnath Reddy Comments On Alliances
Author
Amaravathi, First Published Feb 17, 2020, 5:11 PM IST

తాడేపల్లి: ఐటి శాఖ విడుదల చేసిన ప్రెస్ నోట్ ను క్షుణ్ణంగా చదివితే టిడిపి అసలు బండారం బయటపడుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ రెడ్డి అన్నారు. రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని ఐటి డిపార్ట్‌మెంట్ ఇచ్చిన ప్రకటన ద్వారా భారీ అక్రమాలు జరిగాయని స్పష్టమైందని... చంద్రబాబుకు,ఎల్లోమీడియాకు ఇది కనిపించడం లేదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. 

బోగస్ కంపెనీలతో వేల కోట్లు దారిమళ్లించారని... కోటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలో టిడిపి నేతలకు బాగా తెలుసని ఆరోపించారు. యనమలకు పంటినొప్పితోపాటు కంటిచూపు కూడా పోయిందని... ఆయనకు ప్రభుత్వం తరపున కంటి వైద్యం చేయించాలని సిఎం వైయస్ జగన్ ను కోరతానని అమర్‌నాథ్ రెడ్డి సెటైర్లు విసిరారు.  

దమ్ము ధైర్యం ఉంటే టిడిపి నాయకులు ఐటి అధికారులపై డిఫర్మేషన్ వేయాలని సూచించారు. ''అవినీతి ఆరోపణలపై చంద్రబాబు ఏమాత్రం స్పందించడం లేదు.ఆయన పుత్రుడు లోకేష్ దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ గాని మాట్లాడలేకపోతున్నారు.అర్దరాత్రి విజయవాడనుంచి చంద్రబాబు ఎందుకు హైద్రాబాద్ పారిపోయారు'' అని ప్రశ్నించారు. 

''ఓటుకు నోటు కేసు వచ్చినప్పుడు చంద్రబాబు ఏమన్నారు.సెక్షన్ 8 అన్నారు. చంద్రబాబు హయాంలో కాపులకు సంబందించిన బిసిల అంశం వచ్చినప్పుడు కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టి సబ్జెక్ట్ డైవర్ట్ చేశారు. ఓటుకునోటు కేసులో ఆ ప్రభుత్వంపై దావా వేసే ధైర్యం ఉందా. పోలవరం వద్ద పాటలు పెట్టారు. జయం జయం చంద్రన్న అని ఇప్పుడు అలా కాదు. జైలు జైలు చంద్రన్న అని పాడుకోవాల్సి ఉంటుంది'' అని ఎద్దేవా చేశారు. 

read more  ముఖ్యమంత్రి జగన్ కంటే విజయ్ మాల్యానే నయం...: బుద్దా వెంకన్న

''చంద్రబాబు బినామీలైన నారాయణ, ప్రతిపాటి పుల్లారావు, యరపతినేని, దేవినేని, గల్లా జయదేవ్ లాంటి వ్యక్తులందరూ కూడా ఈ వ్యవహారం ఎక్కడ తమ పీకకు చుట్టుకుంటుందో... బినామి ఆస్తులు బయటపడిపోతాయని బయపడిపోతున్నారని అన్నారు. ఇది గోరంతే ఇంకా కొండంత అవినీతి చేశారు. అదంతా బయటపడి పోతుందనే భయంతో చలి జ్వరం వచ్చిందని ఇంట్లో పడుకున్నారు'' అని చంద్రబాబుపై సెటైర్లు విసిరారు. 

''తన దగ్గర పిఎస్ గా పనిచేసే వ్యక్తి వద్దనే రెండువేల కోట్ల రూపాయల ఆరోపణలువచ్చాయని అంశంపై స్పందించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా. మీకు ఇంకా నీతి నిజాయితి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటూ మాట్లాడే నైతిక అర్హత ఎక్కడ ఉంటుంది'' అని అన్నారు.

''మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి చంద్రబాబుపై కోపం ఉన్నట్లు ఉంది. అందుకోసమే చంద్రబాబుతో పోటీపడి తిరుమల కొండ ఎక్కగలరా అని సవాల్ చేశారు.ఈ వయస్సులో చంద్రబాబు కొండఎక్కితే ఏమవుతుందో తెలిసే ఇలా సవాల్ చేశారంటే ఏమనాలి'' అంటూ అచ్చెన్నాయుడు సవాల్ పై స్పందించారు. 

''రాష్ట్రంలోకి గతంలో ఈడి, సిబిఐలను రాకుండా అడ్డుకుంది చంద్రబాబే. రూ.2 వేల కోట్ల గురించి టిడిపికి ఐటి శాఖ విడుదల చేసిన ప్రెస్ నోట్ ఆరోపణలపై పరువునష్టం దావా వేసే ధైర్యం టిడిపికి ఉందా. మీరు సంపాదించిన ప్రతి రూపాయి అవినీతిమయమే'' అని ఆరోపించారు. 

'' ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల విషయంలో రూ.150 కోట్ల మేర సెర్చ్ లలో దొరికాయని క్లియర్ గా చెప్పారు. ఇంకొకాయన అంటాడు రూ.2 వేల కోట్లు అంటే ఎంతో తెలుసా అని. ఒక సూట్ కేసులో ఎన్ని వేల కోట్లు పడతాయో... ఒక గోనెలో ఎన్ని కొబ్బరి చిప్పలు పడతాయో మాకు తెలియదు'' అని మండిపడ్డారు.

read more  సాక్షిలో నా వార్తలు రావు, కులమే అడ్డమా: వైఎస్ భారతికి వర్ల రామయ్య ప్రశ్న

''రెండు అంశాలపై మా పార్టీ తరపున క్లారిటీ ఇవ్వదలుచుకున్నాం. 2014లో గాని 2019లోగాని అంతకుముందు బైఎలక్షన్ లలో గాని తాము ఎవరితో పొత్తుపెట్టుకోలేదు అనే అంశం ప్రజలందరికి తెలుసు. పొత్తులు పెట్టుకునే సంస్కృతి చంద్రబాబుదే. కేవలం ఐదుకోట్ల మంది ప్రజలతోనే వైయస్సార్ కాంగ్రెస్ పొత్తు. ఏ రాజకీయపార్టీతో మా పార్టీ పొత్తు పెట్టుకోదు'' అని అన్నారు.

''ఇచ్చిన మాటకోసం చెప్పిన ప్రతి పనిని ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని ఎలా నెరవేర్చాలనే దిశగా వైయస్ జగన్ ప్రయాణం చేస్తున్నారు. రాష్ర్ట అభివృధ్ది, ప్రయోజనాలు అనేది మా నాయకుడి ఆలోచన. ఓటుకు రెండు వేలు తీసుకునే ప్రజలకు ప్రశ్నించే హక్కు ఎక్కడుంది అని పవన్ కల్యాణ్ అంటున్నారు. బీమవరంలో 20 కోట్లు, గాజువాకలో 30 కోట్లు ఖర్చు అయినట్లు ఉంది. ఆ ఖర్చు కూడా చంద్రబాబుగారే ఇచ్చినట్లున్నారు.  పవన్ కల్యాణ్ కు వ్యక్తిత్వం,సిధ్దాంతం అనేవే లేవు'' అని మండిపడ్డారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios