MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • Face Pack:మేకప్ తో పనిలేదు.. బియ్యం పిండిలో ఇవి కలిపి రాస్తే చాలు..!

Face Pack:మేకప్ తో పనిలేదు.. బియ్యం పిండిలో ఇవి కలిపి రాస్తే చాలు..!

 ముఖానికి సహజమైన ఉత్పత్తులు ముఖ్యంగా బియ్యం పిండిలో కొన్నింటిని కలిపి రాయడం వల్ల  మేకప్ లాంటివి అవసరం లేకపోయినా.. అందంగా, యవ్వనంగా కనిపించవచ్చు. మరి.. అవేంటో చూద్దామా....

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 08 2025, 05:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

వయసు పెరిగే కొద్దీ యవ్వనంగా, అందంగా కనిపించాలి అంటే మేకప్ ఉండాల్సిందే అనే భావన చాలా మందిలో ఉంటుంది, కానీ, మనం సరైన ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం, హెల్దీ ఫుడ్స్ తినడం  లాంటి చేయడం వల్ల కూడా యవ్వనంగా కనపడొచ్చు. ఇవి కాకుండా..  ముఖానికి సహజమైన ఉత్పత్తులు ముఖ్యంగా బియ్యం పిండిలో కొన్నింటిని కలిపి రాయడం వల్ల  మేకప్ లాంటివి అవసరం లేకపోయినా.. అందంగా, యవ్వనంగా కనిపించవచ్చు. మరి.. అవేంటో చూద్దామా....
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

మనం మన ముఖాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకున్నా, రెగ్యులర్ గా ముఖాన్ని శుభ్రం చేసుకున్నా కూడా ముఖంపై మొటిమలు వస్తూ ఉంటాయి., ఆ మొటిమలు పపోయాయి అనుకునేలోగా బ్లాక్ హెడ్స్ లాంటివి వస్తాయి. ఇలాంటి వాటి వల్ల ముఖం కాంతి కోల్పోతుంది. అందుకే బియ్యం పిండి ఫేస్ ప్యాక్ లను  ప్రయత్నించాలి.

34

మీరు రెండు స్పూన్ల బియ్యం పిండిలో కొద్దిగా నిమ్మరసం, ఒకటిన్నర చెంచాలా గ్రీన్ టీ, ఒక స్పూన్ తేనె ఇవన్నీ కలిపి.. దానిని ముఖానికి రాయాలి. పావు గంట తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. అది కూడా రాత్రి పడుకునే ముందు రాస్తే ఫలితం ఇంకా బాగుంటుంది. ఈ ప్యాక్ రాసుకొని.. సున్నితంగా ముఖానికి మసాజ్ చేయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయానికి ముఖం మెరుస్తూ, కాంతి వంతంగా కనపడుతుంది. బ్లాక్ హెడ్స్ కూడా పోయే అవకాశం ఉంది. వరసగా మూడు రోజులు ఈ ఫేస్ ప్యాక్ రాసినా... మంచి ఫలితాలు చూస్తారు.

44

ఈ నాలుగు మీ ముఖాన్ని ఎలా కాంతివంతం చేస్తాయి..?

ఈ నాలుగు పదార్థాలను మనం ఉపయోగించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. బియ్యం పిండి మన చర్మాన్ని శుభ్రపరచడంలో ఉపయోగపడుతుంది. ఇది కొంచెం గరుకుగా ఉండటం వలన, ఇది మన ముఖానికి మంచి ఎక్స్‌ఫోలియేటర్‌గా కూడా పనిచేస్తుంది. ఇది మొండి మచ్చలను కూడా సులభంగా తొలగిస్తుంది. ఇది మన ముఖాన్ని దాని సహజ రంగులోకి తీసుకువస్తుంది.నిమ్మరసంలోని విటమిన్ సి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది మన చర్మ ఛాయను కూడా మెరుగుపరుస్తుంది. గ్రీన్ టీ మన శరీరం నుండి బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఇది ముఖాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ముఖంపై బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి తేనె సహాయపడుతుంది. ఇది మంచి క్రిమినాశక మందుగా కూడా పనిచేస్తుంది.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Earrings: హగ్గీ ఇయర్ రింగ్స్.. ఆఫీసుకు వెళ్లే వారికి బెస్ట్ ఆప్షన్
Recommended image2
Saree Tips: చీరలో లావుగా కనిపిస్తున్నారా? ఇదొక్క ట్రిక్ తో సన్నగా కనిపిస్తారు, పొట్ట కూడా కనిపించదు
Recommended image3
Bangles: బడ్జెట్ లో అదిరిపోయే వెండి గాజులు.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved