ప్చ్.. వందే భారత్ రైలు వేగం తగ్గిందేంటి? రైల్వే మంత్రి ఏమంటున్నారు?
భారతీయ రైల్వేలో విప్లవం సృష్టించిన రైలు వందే భారత్. ఆధునిక సౌకర్యాలు, అత్యంత వేగంతో వెళ్లే ఈ రైలు ఈమధ్య సామర్థ్యం తగ్గించుకొని తక్కువ స్పీడ్ తో నడుస్తోంది. పట్టాల నాణ్యత, మౌలిక సదుపాయాల కొరత వల్ల రైలు వేగం తగ్గిందని రైల్వే మంత్రి తెలిపారు.

గంటకు 160కి.మీ.ల వేగం
భారతీయ రైల్వేలో కొత్త విప్లవం సృష్టించిన వందే భారత్ రైలు తన సామర్థ్యం కంటే తక్కువ వేగంతో నడుస్తుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ గంటకు 160 కిమీ వేగంతో వెళ్లగలదు.
ప్రారంభించిన కొద్దిసమయంలోనే అత్యంత ఆదరణ పొందిన వందే భారత్ రైలు ప్రయాణికులకు మంచి అనుభూతిని ఇస్తోంది. కానీ ప్రస్తుతం ఇతర ఎక్స్ప్రెస్ రైళ్ల వేగంతోనే వెళ్లడం ప్రయాణికులకు నిరాశ కలిగిస్తోంది. దీనిపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు.
రైళ్ల వేగం పట్టాల నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది. రైలు మౌలిక సదుపాయాలతో పాటు ఇతర అంశాల మీద కూడా రైళ్ల వేగం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం వందే భారత్ 110 కిమీ వేగంతో నడుస్తోంది.
వందే భారత్
2014లో రైలు 110 కిమీ వేగంతో వెళ్లాలంటే, అందుకు అనువైన ట్రాక్ 31,000 కిమీ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ మార్గం 80,000 కిమీకి పెరిగింది. ఈ మార్గంలో వందే భారత్ తో పాటు ఇతర ఎక్స్ప్రెస్ రైళ్లు 110 కిమీ వేగంతో వెళ్తాయి. మిగిలిన మార్గంలో వేగం తగ్గిస్తాయి అని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
వందే భారత్ రైలు నడవడానికి అవసరమైన పట్టాలు లేకపోవడం వల్ల తక్కువ వేగంతో నడుస్తున్నాయి. ప్రయాణికులు జనశతాబ్ది లాంటి ఇతర ఎక్స్ప్రెస్లతో వందే భారత్ను పోలుస్తుంటారు. చెన్నైలో వందే భారత్ రైలు కోచ్ల తయారీ జరుగుతోంది.
2019 ఫిబ్రవరి 15న భారతదేశంలో వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. ఇప్పుడు దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు వందే భారత్ను విస్తరిస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో 136 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలోనే ఈ సంఖ్య పెరుగుతుందని భారత ప్రభుత్వం తెలిపింది.