MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా పనిచేసిన హైదరబాదీ... ఎవరో తెలుసా?

ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా పనిచేసిన హైదరబాదీ... ఎవరో తెలుసా?

హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి రాజకీయాలతో సంబంధం లేకుండానే భారత ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా పనిచేశారు. ఆయన ఎవరో తెలుసా? 

2 Min read
Arun Kumar P
Published : Sep 09 2025, 12:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక హైదరబాదీ...
Image Credit : presidentofindia.nic.in

రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక హైదరబాదీ...

Zakir Hussain : భారతదేశంలోనే అత్యున్నత పదవి రాష్ట్రపతి... రెండో అత్యున్నత పదవి ఉపరాష్ట్రపతి. ఈ రెండు పదవుల్లో ఏ ఒక్కటి దక్కినా రాజకీయంగానే కాదు సమాజంలోనూ ఎవ్వరికీ దక్కని గౌరవం లభిస్తుంది... అందుకే పెద్దగా పవర్స్ లేకున్నా వీటికి బాగా పోటీ ఉంటుంది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది... ఎన్డిఏ నుండి సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుండి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలుగు వ్యక్తి కావడంతో ఈ ఎన్నికలు తెలుగురాష్ట్రాల్లోనూ ఉత్కంఠను రేపుతున్నాయి.

బి. సుదర్శన్ రెడ్డి రెడ్డి తెలంగాణకు చెందినవారు. అయితే ఇప్పటివరకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిగా చేసిన తెలుగువారిలో ఎక్కువమంది ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవారే... కానీ ఒకేఒక్క తెలంగాణ నాయకుడు ఈ రెండు పదవులను అధిరోహించారు. ఆయనే జాకీర్ హుస్సెన్. ఈయన జీవన ప్రస్ధానమంతా ఉత్తర ప్రదేశ్ లో సాగినా పుట్టింది మాత్రం తెలంగాణలోనే... పక్కా హైదరబాదీ ముస్లిం కుటుంబానికి చెందినవారు.

25
జాకీర్ హుస్సెన్ వ్యక్తిగత జీవితం
Image Credit : Pixabay

జాకీర్ హుస్సెన్ వ్యక్తిగత జీవితం

జాకీర్ హుస్సెన్ ఆనాటి నిజాం పాలనలోని హైదరాబాద్ సంస్థానంలో 1897, ఫిబ్రవరి 8న జన్మించారు. ఈయన బాల్యం కొన్నాళ్లు హైదరాబాద్ లోనే సాగింది. అయితే వీరి కుటుంబం హైదరాబాద్ నుండి ఉత్తర ప్రదేశ్ లోని ఫరూఖాబాద్ జిల్లా ఖాయిమ్ గంజ్ కు వలసవెళ్లింది. దీంతో హైదరాబాద్ కు చెందిన జాకీర్ హుస్సెన్ యూపీ వ్యక్తిగా మారిపోయారు. ఆయన విద్యాభ్యాసం, కెరీర్ అంతా యూపీలోనే గడిచింది.

అతి చిన్న వయసులోని మంచి విద్యావేత్తగా గుర్తింపుపొందారు జాకీర్ హుస్సెన్. ఇతడు కేవలం 23 ఏళ్ళ వయసులోని డిల్లీ సమీపంలో జామియా మిలియా ఇస్లామియా ముస్లిం విశ్వవిద్యాలయం స్థాపించారు. అనంతరం జర్మనీలో పి.హెచ్.డి చేశారు... తర్వాత ఇండియాకు వచ్చి స్వాతంత్య్ర పోరాటంలో తనవంతు పాత్ర పోషించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా నియమితులయ్యారు జాకీర్ హుస్సెన్. 

Related Articles

Related image1
Vice President Elections 2025 : ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కు బిఆర్ఎస్ దూరం.. ఎందుకో తెలుసా?
Related image2
Vice President Elections 2025 : తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ సపోర్ట్ ఎవరికి?
35
ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా జాకీర్ హుస్సెన్
Image Credit : Generated by google gemini AI

ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా జాకీర్ హుస్సెన్

ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకపోయినా ఉన్నత విద్యావంతుడైన జాకీర్ హుస్సెన్ పలు ఉన్నత పదవులు అదిరోహించారు. ఆయన రాజ్యసభ సభ్యునిగా, బిహార్ గవర్నర్ గా పనిచేశారు. అయితే 1962 లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు... ఇలా దేశానికి రెండో ఉపరాష్ట్రపతి, మొదటి ముస్లిం ఉపరాష్ట్రపతిగా మారారు. 1967 లో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు… మొదటి ముస్లిం రాాష్ట్రపతి కూడా ఈయనే… అయితే ఈ పదవిలో ఉండగానే ఆయన మరణించారు. ఇలా అత్యల్ప కాలం రాష్ట్రపతిగా చేయడమే కాదు పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి జాకీర్ హుస్సెన్. ఈయనకు భారత రత్న అవార్డు లభించింది.

45
రాష్ట్రపతిగా పనిచేసిన ఆంధ్ర ప్రదేశ్ నాయకుడెవరు?
Image Credit : X/rashtrapatibhvn

రాష్ట్రపతిగా పనిచేసిన ఆంధ్ర ప్రదేశ్ నాయకుడెవరు?

జాకీర్ హుస్సెన్ హైదరాబాద్ లోనే పుట్టినా ఆయన జీవనమంతా ఉత్తర ప్రదేశ్ లో సాగింది కాబట్టి అక్కడి వ్యక్తిగానే గుర్తిస్తారు. మరి తెలుగు రాష్ట్రాల నుండి రాష్ట్రపతిగా పనిచేసిన మొదటివ్యక్తి నీలం సంజీవరెడ్డి. తెలుగు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈయన దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని పొందారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.

55
ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు
Image Credit : PM Modi/X

ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు

దేశానికి ఉపరాష్ట్రపతిగా పనిచేసిన నాయకుడు వెంకయ్య నాయుడు. బిజెపిలో కీలక నేతగా ఎదిగిన ఈయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. జగదీప్ దన్కర్ కు ముందు ఈయనే ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. 2017 ఆగస్ట్ 11 నుండి 2022 ఆగస్ట్ 11 వరకు భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ఉన్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
రాజకీయాలు
ఏషియానెట్ న్యూస్
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved