MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Weather Update: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

Weather Update: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

IMD Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 14 2026, 08:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వచ్చే కొద్ది గంటల్లో విరుచుకుపడనున్న భారీ వర్షాలు!
Image Credit : Chatgpt

వచ్చే కొద్ది గంటల్లో విరుచుకుపడనున్న భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ వేగంగా బలపడుతుండటంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ అల్పపీడన ప్రభావంతో తూర్పు, మిడిల్, ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. ప్రస్తుతానికైతే ఈ వాతావరణ వ్యవస్థ వాయువ్య దిశగా పయనిస్తూ పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంతో పాటు దానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ వైపు కదిలింది. రాబోయే గంటల్లో ఇది గంగా మైదాన ప్రాంతాలు, జార్ఖండ్ వైపు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లతో డేంజర్ బెల్స్
Image Credit : Chatgpt

రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లతో డేంజర్ బెల్స్

అల్పపీడనం తీవ్రరూపం దాల్చుతుండటంతో వాతావరణ శాఖ పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉన్న పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, జార్ఖండ్‌కు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో కొన్ని చోట్ల ఏకంగా 204.5 మిల్లీమీటర్లకు పైగా అత్యంత భారీ వర్షపాతం నమోదు కావచ్చు. ఇక జార్ఖండ్‌లో 115.6 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రహదారులు మునిగిపోయి రవాణాకు ఆటంకం కలగడం, నదులలో నీటిమట్టం ప్రమాదకరంగా పెరగడం వంటి ముప్పులు పొంచి ఉన్నాయి.

Related Articles

Related image1
Russia India Train Route: పెద్ద స్కెచ్చే వేశారు.. భారత్ నుంచి పాకిస్తాన్ మీదుగా ఆ దేశానికి రైల్వే లైన్
Related image2
Maoists Fashion Show: వారెవ్వా అదరగొట్టారు.. నిన్నటిదాకా తుపాకీ పట్టిన చేతులతోనే ఇప్పుడు ఫ్యాషన్ షో !
35
మరో 15కు పైగా రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్
Image Credit : AI

మరో 15కు పైగా రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్

కేవలం తూర్పు ప్రాంతాలే కాకుండా దేశంలోని మరో 15కు పైగా రాష్ట్రాలు ప్రస్తుతం ఎల్లో అలర్ట్ పరిధిలో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, తూర్పు ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లడఖ్, కేరళ, కొంకణ్-గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్‌లోని కొన్ని భాగాలు, కర్ణాటక, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ ఎంపీలలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని తెలుస్తోంది. రుతుపవన ద్రోణి చురుకుగా ఉండటంతో పాటు పశ్చిమ అవాంతరం కూడా తోడవడంతో గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు పెరిగే ప్రమాదం ఉంది.

45
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఇలా
Image Credit : Gemini

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఇలా

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, తెలంగాణవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన జల్లులు పడే అవకాశముంది. హైదరాబాద్ పరిసర జిల్లాల్లో రోజంతా ఆకాశం మేఘావృతమై ఉండి అడపాదడపా జల్లులు పడతాయి.

ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మంలలో మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో కొద్దిసేపు భారీ వర్షాలు పడవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. తీరప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలి.

55
ప్రజలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Image Credit : Getty

ప్రజలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తీవ్రమైన గాలులు, పిడుగుల ప్రమాదం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిది. వర్షాలు, మెరుపులు పడే సమయంలో చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాలు లేదా బలహీనమైన నిర్మాణాల వద్ద నిలబడకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైతులు తమ పంట ఉత్పత్తులను తడిచిపోకుండా సురక్షిత ప్రాంతాల్లో నిల్వ చేసుకోవాలి. పశువులను ఎత్తైన ప్రాంగణాల్లోకి తరలించి జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు కోరుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
అమరావతి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Revanth Reddy Powerful Speech: కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు శ్రీకారం | Asianet Telugu
Recommended image2
Now Playing
దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ! | Hyderabad Old City House Theft | Thief Sleeping In House
Recommended image3
Now Playing
దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ! కట్ చేస్తే **** | Hyderabad Old City House Theft
Related Stories
Recommended image1
Russia India Train Route: పెద్ద స్కెచ్చే వేశారు.. భారత్ నుంచి పాకిస్తాన్ మీదుగా ఆ దేశానికి రైల్వే లైన్
Recommended image2
Maoists Fashion Show: వారెవ్వా అదరగొట్టారు.. నిన్నటిదాకా తుపాకీ పట్టిన చేతులతోనే ఇప్పుడు ఫ్యాషన్ షో !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved