MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Telangana
  • TS Inter Results: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల: బాలికలదే హవా.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..?

TS Inter Results: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల: బాలికలదే హవా.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..?

TS Inter Results: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి 2026 పరీక్షల ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈ ఫలితాలను వెల్లడించారు. 

2 Min read
Author : Pavithra D
Published : Apr 12 2026, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల
Image Credit : Pinterest

ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాతో కలిసి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను వెల్లడించారు. ఈ ఏడాది కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించగా, మొత్తం ఉత్తీర్ణత శాతంలో రాష్ట్రం గణనీయమైన ఫలితాలను నమోదు చేసింది. ఫలితాల కోసం విద్యార్థులు వెబ్‌సైట్‌లతో పాటు వాట్సప్ సదుపాయాన్ని కూడా వినియోగించుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫలితాల గణాంకాలు: బాలికల జోరు
Image Credit : Pinterest

ఫలితాల గణాంకాలు: బాలికల జోరు

ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో బాలికలు 74.4 శాతంతో ముందంజలో ఉండగా, బాలురు 57.69 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో 3,23,807 మంది(66.20 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 3,58,490 మంది (70 శాతం) విద్యార్థులు విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. అయితే, సుమారు 4 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడం గమనార్హం. జిల్లాల వారీగా చూస్తే.. మేడ్చల్ ఫస్టియర్ ఫలితాల్లో.. భూపాలపల్లి సెకండియర్ ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచాయి. ఈ సందర్భంగా కె. కేశవరావు మాట్లాడుతూ, పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు మనస్తాపంతో ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఉంటాయని భరోసా ఇచ్చారు.

Related Articles

Related image1
Telangana: బీటెక్‌లాగే డిగ్రీకి కూడా ఎంట్ర‌న్స్ ఎగ్జామ్.? భారీ మార్పున‌కు రంగం సిద్ధం.?
Related image2
Telangana : తెలుగోళ్లకు మాత్రమే బంపరాఫర్... ఈవి వాహనాలపై 20 శాతం డిస్కౌంట్
35
ఫలితాలను చూసుకోవడం ఎలా?
Image Credit : Pinterest

ఫలితాలను చూసుకోవడం ఎలా?

విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ల ద్వారా పొందవచ్చు. tgbie.cgg.gov.in, results.cgg.gov.in నుంచి.. అలాగే వాట్సప్ ద్వారా సులభంగా విద్యార్థులు 80969 58096 నంబర్‌కు 'Hi' అని మెసేజ్ పంపి, ఆపై 'BIE Exam Result' అని టైప్ చేస్తే మీ ఫలితాలు నేరుగా మీ మొబైల్‌కు వస్తాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఈ పరీక్షల మూల్యాంకన ప్రక్రియను బోర్డు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఫలితాలను వెల్లడించింది. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఉన్నత చదువుల బాటలు పడగా, ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం త్వరలోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటించారు.

45
రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ వివరాలు
Image Credit : Pinterest

రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ వివరాలు

ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని భావించే విద్యార్థుల కోసం బోర్డు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ సదుపాయాన్ని కల్పించింది. ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపర్‌కు రూ. 100, రీవెరిఫికేషన్ (స్కాన్డ్ కాపీతో కలిపి) కోసం రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది.

55
సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్
Image Credit : Pinterest

సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్

ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా బోర్డు ప్రకటించింది. మే 24 నుండి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పరీక్ష ఫీజును ఏప్రిల్ 24లోపు చెల్లించాల్సి ఉంటుంది. ఇంప్రూవ్‌మెంట్ కోరుకునే విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు హాజరుకావచ్చు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
Recommended image2
అమెరికాకు అందుకోసమే వెళ్లాలనుకున్నా.. కానీ అడ్డుకున్నారు : సీఎం రేవంత్ రెడ్డి
Recommended image3
Holidays : ఇంకా ఒక్కరోజే స్కూలు, కాలేజీ, ఆఫీసులకు వెళ్లండి.. తర్వాత వరుసగా ఐద్రోజుల సెలవులు పొందండి
Related Stories
Recommended image1
Telangana: బీటెక్‌లాగే డిగ్రీకి కూడా ఎంట్ర‌న్స్ ఎగ్జామ్.? భారీ మార్పున‌కు రంగం సిద్ధం.?
Recommended image2
Telangana : తెలుగోళ్లకు మాత్రమే బంపరాఫర్... ఈవి వాహనాలపై 20 శాతం డిస్కౌంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved