- Home
- Telangana
- Telangana First Airport: నిజాం కాలంలోనే నైట్ ల్యాండింగ్.. తెలంగాణ ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఏదో తెలుసా?
Telangana First Airport: నిజాం కాలంలోనే నైట్ ల్యాండింగ్.. తెలంగాణ ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఏదో తెలుసా?
Telangana First Airport: భారత స్వాతంత్ర్యానికి ముందే తెలంగాణలో విమానాలు ఏగిరాయి. మరి తెలంగాణలో మొదటి ఎయిర్పోర్ట్ ఏదో మీకు తెలుసా? నిజాం కాలం నాటి రికార్డులు, డెక్కన్ ఎయిర్వేస్ ఆసక్తికర విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.

తెలంగాణ ఫస్ట్ ఎయిర్పోర్ట్ బేగంపేట హిస్టరీ
తెలంగాణ అనగానే మనకు ఇప్పుడు శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (RGIA) గుర్తుకొస్తుంది. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదిరిపోయే టెక్నాలజీతో ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్పోర్ట్లలో ఒకటిగా ఇది పేరు తెచ్చుకుంది. కానీ, హైదరాబాద్ సిటీ నడిబొడ్డున దశాబ్దాల పాటు విమానాల రాకపోకలతో సందడిగా ఉన్న మన తెలంగాణ ఫస్ట్ ఎయిర్పోర్ట్ ‘బేగంపేట ఎయిర్పోర్ట్’ గురించి మీకు తెలుసా? 1930ల్లోనే మిలియన్ల మంది ప్రయాణికులను చేరవేస్తూ, భారతదేశ విమానయాన చరిత్రలోనే ఓ రేంజ్ రికార్డులు క్రియేట్ చేసిన బేగంపేట ఎయిర్పోర్ట్ క్రేజీ జర్నీ వివరాలు గమనిస్తే..
నిజాం రాజుల కాలంలోనే సూపర్ ఎయిర్పోర్ట్
బేగంపేట ఎయిర్పోర్ట్ కేవలం ఒక ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, హైదరాబాద్ హిస్టరీలో ఒక ల్యాండ్మార్క్. హైదరాబాద్ చివరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1930లో ‘హైదరాబాద్ ఏరో క్లబ్’ ఏర్పాటుతో దీనిని స్టార్ట్ చేశారు. 1930ల కాలంలో చాలా దేశాల్లో కనీసం రన్వేలు కూడా సరిగ్గా లేని టైమ్లోనే, బేగంపేట ఎయిర్పోర్ట్లో ‘నైట్ ల్యాండింగ్’ ఎక్విప్మెంట్ ఉండేదంటే నమ్ముతారా? నిజాం రాజులు తమ పర్సనల్, ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ట్రావెల్ కోసం దీనిని వాడేవారు. ఆ తర్వాత 1937లో ఇక్కడ ఒక గ్రాండ్ టెర్మినల్ బిల్డింగ్ను కూడా కట్టారు.
టాటా, నిజాంల ‘డెక్కన్ ఎయిర్వేస్’ క్రేజీ స్టోరీ
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికి దేశంలో కేవలం 9 ఎయిర్లైన్స్ మాత్రమే ఉండేవి. అందులో అత్యంత పాపులర్ అండ్ ప్రీమియర్ ఎయిర్లైన్ ‘డెక్కన్ ఎయిర్వేస్ లిమిటెడ్’. దీనిని 1945లో నిజాం ప్రభుత్వం, టాటా ఎయిర్లైన్స్ కలిసి జాయింట్ వెంచర్గా స్థాపించాయి. ఈ కంపెనీలో నిజాం ప్రభుత్వానికి ఏకంగా 71 శాతం వాటా ఉంటే, మిగిలిన షేర్లు టాటా సన్స్, ఇతరుల దగ్గర ఉండేవి. జూలై 1946లో మూడు విమానాలతో ఈ ఎయిర్లైన్ కమర్షియల్ ఆపరేషన్స్ స్టార్ట్ చేసింది.
మద్రాస్ నుంచి ఢిల్లీకి.. హైదరాబాద్, నాగ్పూర్, భోపాల్, గ్వాలియర్ మీదుగా వారానికి రెండు సార్లు విమానాలు నడిపేవారు. అలాగే హైదరాబాద్-బెంగళూరు మధ్య కూడా సర్వీసులు ఉండేవి. మార్చి 1947 కల్లా వీరి ఫ్లీట్లో 7 విమానాలు చేరాయి. అప్పటికే మద్రాస్-ఢిల్లీ ఫ్లైట్తో పాటు ప్రతిరోజూ హైదరాబాద్-బాంబే ఫ్లైట్ కూడా రన్ చేశారు. జూలై 1946 నుండి మే 1947 మధ్య కాలంలోనే ఈ ఎయిర్లైన్ ఏకంగా 11 వేల మంది ప్రయాణికులను, 51 టన్నుల కార్గోను, దాదాపు 7 టన్నుల మెయిల్ను చేరవేసి రికార్డ్ సృష్టించింది. ఆ తర్వాత 1953లో ఎయిర్ కార్పొరేషన్స్ యాక్ట్ కింద ఈ డెక్కన్ ఎయిర్వేస్ను మరో ఏడు ఎయిర్లైన్స్తో విలీనం చేసి ‘ఇండియన్ ఎయిర్లైన్స్’గా మార్చారు.
క్లింటన్ ‘ఎయిర్ ఫోర్స్ వన్’ ల్యాండింగ్ ఇక్కడే
కాలక్రమేణా బేగంపేట ఎయిర్పోర్ట్ రేంజ్ పెరిగిపోయింది. ప్రయాణికుల రద్దీ ఏడాదికి 45 శాతం చొప్పున పెరిగింది. ఇది అప్పట్లో ఇండియన్ ఎయిర్పోర్ట్స్లోనే అత్యధికం. క్లోజ్ చేసే టైమ్కు ఇది ఇండియాలోనే 6వ బిజీయెస్ట్ ఎయిర్పోర్ట్గా నిలిచింది. ఇక్కడ రోజుకు 20 వేల మంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేసేవారు. 16 ఇంటర్నేషనల్, 10 డొమెస్టిక్ ఎయిర్లైన్స్కు చెందిన దాదాపు 300 విమానాలు రోజు ఇక్కడ ల్యాండ్ అయ్యేవి. ఏరోబస్ A320, బోయింగ్ 737 వంటి పెద్ద విమానాలను హ్యాండిల్ చేయడానికి ఇక్కడ 13 పార్కింగ్ బేలు, ఓల్డ్ బ్లాక్ వైపు 5 నైట్ పార్కింగ్ బేలు ఉండేవి.
ఈ ఎయిర్పోర్ట్ హిస్టరీలోనే ఒక క్రేజీ మూమెంట్ ఏంటంటే.. 2000 సంవత్సరంలో అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు, ఆయన అఫీషియల్ విమానం ‘ఎయిర్ ఫోర్స్ వన్’ బేగంపేట ఎయిర్పోర్ట్ రన్వే పైనే ల్యాండ్ అయ్యింది. 2005 ఫిబ్రవరిలో లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ ఎయిర్ బస్ A340 విమానంతో హైదరాబాద్ టు ఫ్రాంక్ఫర్ట్ మధ్య డైరెక్ట్ నాన్స్టాప్ ఫ్లైట్ను కూడా ఇక్కడి నుంచే రన్ చేసింది.
శంషాబాద్కు షిఫ్ట్.. కొత్త అవతారంలో బేగంపేట
ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడం, సిటీ మధ్యలో ఉండటంతో రన్వే విస్తరణకు స్కోప్ లేకపోవడంతో.. కొత్త ఎయిర్పోర్ట్ అవసరం పడింది. దీంతో మార్చి 23, 2008న శంషాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవ్వడంతో బేగంపేటలో కమర్షియల్ ఫ్లైట్స్ ఆపరేషన్స్ పూర్తిగా క్లోజ్ అయ్యాయి. కానీ బేగంపేట ఎయిర్పోర్ట్ కథ అక్కడితో అయిపోలేదు. ప్రస్తుతం ఈ విమానాశ్రయాన్ని జనరల్ అండ్ మిలిటరీ ఏవియేషన్ కోసం వాడుతున్నారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్గా, వీఐపీ విమానాల రాకపోకల కోసం, ప్రైవేట్ చార్టర్ ఫ్లైట్స్ కోసం ఇది రన్ అవుతోంది. అలాగే ఇక్కడ నార్తన్ పార్ట్ ప్రోహిబిటెడ్ ఎయిర్స్పేస్ కావడం వల్ల, ట్రైనీ పైలట్లు ఎయిర్పోర్ట్కు కేవలం సౌత్ వైపు మాత్రమే ట్రైనింగ్ ఫ్లైట్స్ నడుపుతుంటారు. తెలంగాణ ఏవియేషన్ అకాడమీ, ఏషియా పసిఫిక్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ, రాజీవ్ గాంధీ ఏవియేషన్ అకాడమీలు ఇక్కడి నుంచే పైలట్ ట్రైనింగ్ ఇస్తున్నాయి.
ఇండియా ఏవియేషన్ ఎయిర్ షోస్
కమర్షియల్ ఫ్లైట్స్ ఆగిపోయిన తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ సివిలియన్ ఎయిర్ షోలకు అడ్డాగా మారింది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎఫ్ఐసీసీఐ సంయుక్తంగా నిర్వహించిన ఇండియాలోనే మొట్టమొదటి సివిలియన్ ఎయిర్ షో ‘ఇండియా ఏవియేషన్ 2008’ ఇక్కడే అక్టోబర్ 15-18 మధ్య గ్రాండ్గా జరిగింది. ఆ తర్వాత 2010లో జరిగిన సెకండ్ ఎడిషన్లో ఫ్రాన్స్ పార్ట్నర్ కంట్రీగా, యూఎస్ ఫోకస్ కంట్రీగా వ్యవహరించాయి. దాదాపు 200 మంది ఎగ్జిబిటర్లు, 12,000 చదరపు మీటర్ల ఏరియాలో ఈ ఈవెంట్ జరిగింది.
భారతదేశంలోనే మొదటిసారి ‘Antonov An-148’ విమానాన్ని ఇక్కడే ప్రదర్శించారు. 5 వేల మందికి పైగా బిజినెస్ విజిటర్లు, వందల మంది సీఈఓలు ఈ ఈవెంట్కు వచ్చారు. ఆ తర్వాత 2012లో కూడా ఇక్కడే థర్డ్ ఎడిషన్ ఎయిర్ షో సక్సెస్ఫుల్గా నిర్వహించారు. ఏది ఏమైనా, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బేగంపేట ఎయిర్పోర్ట్ హిస్టరీ మాత్రం ఎప్పటికీ ఎవర్గ్రీన్ అని చెప్పాలి.

