MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Telangana : ప్రధాని పర్యటన రోజే .. శ్రీశైలంపై రేవంత్ కేబినెట్ కీలక నిర్ణయం

Telangana : ప్రధాని పర్యటన రోజే .. శ్రీశైలంపై రేవంత్ కేబినెట్ కీలక నిర్ణయం

Telangana Cabinet Decisions : రేవంత్  రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బిసి రిజర్వేషన్లు, వ్యవసాయ కాలేజీలతో పాటు శ్రీశైలంకు సంబంధించి నిర్ణయాలు ఇందులో ఉన్నాయి. 

2 Min read
Arun Kumar P
Published : Oct 16 2025, 08:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నేడు వార్తల్లో శ్రీశైలం
Image Credit : N Chandrababu Naidu/X

నేడు వార్తల్లో శ్రీశైలం

Telangana : ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం నేడు(అక్టోబర్ 16) ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రధాన వార్తగా నిలిచింది. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. మరోవైపు హైదరాబాద్ నుండి శ్రీశైలంకు వెళ్లే రహదారి రూపురేఖలను మార్చేందుకు తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

25
శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ కు కేబినెట్ ఆమోదం
Image Credit : X/Telangana Congress

శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ కు కేబినెట్ ఆమోదం

హైదరాబాద్ నుండి శ్రీశైలంకు వెళ్లే రహదారిలో నాలుగులేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్దమయ్యింది. దాదాపు రూ.7,668 కోట్ల వ్యయంతో 45 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగానే కృష్ణానదిపై ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు తెలిపింది. హైదరాబాద్, శ్రీశైలం మధ్య ప్రయాణ సమయం తగ్గడమే కాదు నల్లమల అడవిలోని జంతువుల సంరక్షణకు ఈ ఎలివేటెడ్ కారిడార్ ఉపయోగపడుతుంది.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి దీనిపై చర్చించి ఆమోదం తెలిపింది. ఈ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి అయ్యే ఖర్చులో 50 శాతం భరించాలని నిర్ణయం తీసుకుంది.

Related Articles

Related image1
Telangana Bandh : అధికార పార్టీ కీలక నిర్ణయం... శనివారం స్కూళ్లు, కాలేజీలకు సెలవు కన్ఫర్మ్?
Related image2
Telangana: బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై సుప్రీం సంచ‌ల‌న నిర్ణ‌యం.. రేవంత్ ప్ర‌భుత్వానికి చుక్కెదురు. వాట్ నెక్ట్స్‌.?
35
తెలంగాణలో మరో మూడు వ్యవసాయ కాలేజీలు
Image Credit : Getty

తెలంగాణలో మరో మూడు వ్యవసాయ కాలేజీలు

తెలంగాణలో మరో మూడు వ్యవసాయ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నల్గొండ, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో కాలేజీలను ఏర్పాటుచేయాలని... వచ్చే విద్యాసంవత్సరం నుండి విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించి తరగతులు ప్రారంభించాలని నిర్ణయించింది.

45
బిసి రిజర్వేషన్లపై చర్చ
Image Credit : X/Telangana Congress

బిసి రిజర్వేషన్లపై చర్చ

తెలంగాణలో బిసి రిజర్వేషన్ల అంశం వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సహచర మంత్రులతో చర్చించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోవడం... హైకోర్ట్, సుప్రీంకోర్టులు బిసి రిజర్వేషన్ల పెంపుకు అనుమతించకపోవడంతో ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై కేబినెట్ లో చర్చించారు. సీనియర్ న్యాయవాదులు సలహాలు, సూచనలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది.

55
డిసెంబర్ లో ప్రజాపాలన విజయోత్సవాలు
Image Credit : Asianet News

డిసెంబర్ లో ప్రజాపాలన విజయోత్సవాలు

కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే డిసెంబర్ తో రెండేళ్లు పూర్తవుతుంది. దీంతో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని రేవంత్ కేబినెట్ నిర్ణయించింది. ఇలా డిసెంబర్ డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారుల ఆదేశాలు జారీచేసింది ప్రభుత్వం.

ఇంకా మెట్రో ఫేజ్ 2, రైతు భరోసా వంటి మరికొన్ని కీలక అంశాలపై కూడా కేబినెట్ లో చర్చ జరిగినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఆమెపై వేటుపడే అవకాశాలన్నాయన్న ప్రచారానికి కేబినెట్ భేటీకి హాజరుకాకపోవడం మరింత బలాన్ని ఇస్తోంది. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
అనుముల రేవంత్ రెడ్డి
నరేంద్ర మోదీ
నారా చంద్రబాబు నాయుడు
పవన్ కళ్యాణ్
రాజకీయాలు
వ్యవసాయం (Vyavasayam)
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved