MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Revanth Reddy: కేసీఆర్ కాళేశ్వరం కట్టింది అందుకే.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy: కేసీఆర్ కాళేశ్వరం కట్టింది అందుకే.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy: హైదరాబాద్‌ శిల్పకళలో నిర్వహించిన రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన నిర్ణయాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై ఆయన మాట్లాడారు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 30 2026, 08:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు
Image Credit : Telangana CMO/X

కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు

కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజల అవసరాల కంటే భారీ కమిషన్ల కోసమే తొందరపాటుగా నిర్మించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టులో లోపాలు బయటపడినా, ఆ విజయాన్ని తమదిగా చెప్పుకుంటూ ప్రజలను తప్పుదారి పట్టించారని అన్నారు. బోరు నీటితో సాగు జరిగినా దానిని కూడా కాళేశ్వరం ఘనతగా ప్రచారం చేశారని విమర్శించారు. అయినప్పటికీ ప్రస్తుతం తెలంగాణ వరి సాగులో అగ్రస్థానంలో కొనసాగుతోందని, రైతులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కేసీఆర్ హామీలపై ప్రశ్నలు
Image Credit : Revanth Reddy Twitter

కేసీఆర్ హామీలపై ప్రశ్నలు

గత ప్రభుత్వం ప్రకటించిన అనేక హామీలు అమలు కాలేదని సీఎం ఆరోపించారు. రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి పంపిణీ జరగలేదని అన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ప్రతి కుటుంబానికి ఉద్యోగం వంటి హామీలు కూడా నెరవేరలేదని విమర్శించారు.

వరి సాగు చేయవద్దని రైతులను హెచ్చరించి, తర్వాత పండించిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆల్కహాల్ వినియోగం పెరిగేలా బెల్ట్ షాపులకు ప్రోత్సాహం లభించిందని కూడా వ్యాఖ్యానించారు.

Related Articles

Related image1
Lava Smart 4 Plus: భారీ డిస్‌ప్లే, వాట‌ర్ రెసిస్టెంట్ ఫోన్‌.. ధ‌ర రూ. 10 వేల‌లోపు అంటే న‌మ్ముతారా.?
Related image2
ఏ దావత్‌లో చూసినా, ఏ కార్ల‌లో విన్నా ఇదే పాట‌.. మిలియ‌న్ల వ్యూస్‌తో దుమ్మురేపుతోన్న బాసింగ బ‌లాలు
35
బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపైనా విమర్శలు
Image Credit : Revanth Reddy Twitter

బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపైనా విమర్శలు

రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు చేశారు. ప్రతి పేద కుటుంబానికి రూ.15 లక్షలు జమ చేస్తామని, ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలు అమలు కాలేదని ప్రశ్నించారు. అలాగే తెలంగాణ రాజకీయ పరిస్థితులు పశ్చిమ బెంగాల్‌తో పోల్చలేమని పేర్కొంటూ, అక్కడ అధికారంలోకి రావడానికి బీజేపీకి చాలా కాలం పట్టిందని అన్నారు.

45
ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ చర్యలపై వివరణ
Image Credit : X/revanth_anumula

ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ చర్యలపై వివరణ

రాష్ట్రం భారీ అప్పుల భారంతో తమ ప్రభుత్వానికి వచ్చిందని రేవంత్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని, దాని ప్రభావం ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన సమయంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కూడా కష్టంగా మారిందని, మధ్యాహ్న భోజన పథకం బిల్లులు, గ్రామపంచాయతీల బకాయిలు, సర్పంచ్‌ల చెల్లింపులు వంటి అనేక పెండింగ్ బిల్లులు ఉన్నాయని వివరించారు. ఆ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని తెలిపారు.

55
రైతు భరోసా, ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటనలు
Image Credit : Revanth Reddy Twitter

రైతు భరోసా, ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటనలు

వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం అన్నారు. ఈసారి తక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. సాగు సీజన్ ప్రారంభంలోనే రైతు భరోసా నిధులు అందేలా చర్యలు తీసుకున్నామని, తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాల్లో సుమారు రూ.9 వేల కోట్లు జమ చేస్తామని వెల్లడించారు. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కూడా మాట్లాడిన రేవంత్ రెడ్డి, గత రెండేళ్లలో సుమారు 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మహిళల భాగస్వామ్యాన్ని పెంచే చర్యలు కూడా చేపట్టామని వివరించారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
అనుముల రేవంత్ రెడ్డి

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు పడి పడి నవ్విన అధికారులు, రైతులు | Telangana Rythu Bharosa
Recommended image2
Now Playing
తవ్వే కొద్దీ గుట్టలు గా అప్పులు బయట పడుతున్నాయి | CM Revanth Reddy Launches Telangana Rythu Bharosa
Recommended image3
సిగాచి పేలుడు ఘటనపై రాజకీయ రచ్చ.. హరీష్ రావుకు మంత్రి వివేక్ వెంకటస్వామి కౌంటర్
Related Stories
Recommended image1
Lava Smart 4 Plus: భారీ డిస్‌ప్లే, వాట‌ర్ రెసిస్టెంట్ ఫోన్‌.. ధ‌ర రూ. 10 వేల‌లోపు అంటే న‌మ్ముతారా.?
Recommended image2
ఏ దావత్‌లో చూసినా, ఏ కార్ల‌లో విన్నా ఇదే పాట‌.. మిలియ‌న్ల వ్యూస్‌తో దుమ్మురేపుతోన్న బాసింగ బ‌లాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved