- Home
- Telangana
- Rain Alert : ఎండాకాలమా లేక వర్షాకాలమా..! మరో ఐద్రోజులు వానలే వానలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
Rain Alert : ఎండాకాలమా లేక వర్షాకాలమా..! మరో ఐద్రోజులు వానలే వానలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో మరో ఐద్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి? ఏఏ జిల్లాల్లో ఎండలు మండిపోనున్నాయి? ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Rain Alert
Telangana and Andhra Pradesh Weather : అసలు ఇది ఎండాకాలమా లేక వానాకాలమా అన్న అనుమానం తెలుగు ప్రజలకు కలుగుతోంది. వేసవికాలం మొదలైనప్పటి నుండి మధ్యాహ్నం ఎండలు, సాయంత్రం వానలు కురుస్తున్నారు. ఇలా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఎండావాన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇంతకాలం చిరుజల్లులే కురిసాయి... కానీ నిన్న(శుక్రవారం) హైదరాబాద్ తో పాటు ఇరు రాష్ట్రాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఈ వర్షపునీరు రోడ్లపై వరదలా పారుతూ వర్షాకాలం ఫీలింగ్ తీసుకువచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి... మరో ఐద్రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అక్కడక్కడ వడగళ్ళ వానలు కూడా కురుస్తాయని హెచ్చరించారు.
Telangana Weather
ఈ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ :
ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి... నిన్న హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షాలు మరో ఐద్రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలోని 16 జిల్లాల్లో వర్షసూచనలు కనిపిస్తున్నాయని ప్రకటించారు... రెండ్రోజులపాటు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు.
హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. అలాగే మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయట. ఈ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు.
ఇదే సమయంలో కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, వికారాబాద్ జిల్లాల్లో మధ్యాహ్నం ఎండలు మండిపోతాయి. ఈ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు.
Andhra Pradesh Weather
ఏపీ జిల్లాలకు వర్షాలు :
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ నాలుగైదు రోజులు వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా కాకినాడ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక మన్యం, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి.
రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా వర్షాలు కురవకున్నా వాతావరణం చల్లబడుతుందని తెలిపారు. అయితే కొన్ని జిల్లాల్లో ఎండలు మండిపోయి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. ఇలా ఓవైపు ఎండలు... మరోవైపు ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ విభాగం హెచ్చరిస్తోంది.
Hyderabad Rains
హైదరాబాద్ లో వర్షపాతం :
శుక్రవారం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఏప్రిల్ లో ఈస్థాయి వర్షపాత నమోదవడం చాలా అరుదు. అత్యధికంగా బండ్లగూడ ప్రాంతంలో 8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇక పాతబస్తీ ప్రాంతంలోని బహదూర్ పురా, చార్మినార్ లో 7 సెం.మీ, నాంపల్లిల్లో 6 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది.
నగరంలోని అబిడ్స్, బంజారాహిల్స్, మాదాపూర్, చైతన్యపురి, దిల్సుఖ్నగర్, వనస్థలిపురం, గాంధీభవన్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది... రైల్వే బ్రిడ్జిలు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, పలుచోట్లు చెట్లు, హోర్డింగ్ లు కూలాయి. మియాపూర్, కూకట్ పల్లి, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, సికింద్రాబాద్, గాంధీ ఆస్పత్రి, మెట్టుగూడ ప్రాంతాల్లో కూడా వర్షం దంచికొట్టింది.
Telugu States Weather
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో నేటి వాతావరణం :
హైదరాబాద్
గరిష్ట ఉష్ణోగ్రత: 38.9°C
కనిష్ట ఉష్ణోగ్రత: 26.7°C
అనుభూతి చెందే ఉష్ణోగ్రత: 41.1°C
విశాఖపట్నం
గరిష్ట ఉష్ణోగ్రత: 33.3°C
కనిష్ట ఉష్ణోగ్రత: 29.4°C
అనుభూతి చెందే ఉష్ణోగ్రత: 39.4°C
విజయవాడ
గరిష్ట ఉష్ణోగ్రత: 41.7°C
కనిష్ట ఉష్ణోగ్రత: 27.8°C
అనుభూతి చెందే ఉష్ణోగ్రత: 46.7°C