MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Hyderabad ప్రజలకు గుడ్ న్యూస్.. ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ రెడీ

Hyderabad ప్రజలకు గుడ్ న్యూస్.. ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ రెడీ

Hitec City Railway Station: హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ₹26 కోట్లతో ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో మారిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను జూలై 17న ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 16 2026, 01:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఎయిర్‌పోర్ట్‌లా మారిపోయిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్
Image Credit : X/kishanreddybjp

ఎయిర్‌పోర్ట్‌లా మారిపోయిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్

హైదరాబాద్ ఐటీ హబ్‌లో రోజువారీ ప్రయాణాలు చేసే వారికి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఇప్పుడు సరికొత్త హంగులతో, సరిగ్గా ఒక ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో ముస్తాబైంది. ప్రతిరోజూ ఆఫీసులకు వెళ్లే వేలాది మంది ఐటీ ఉద్యోగులకు, సాధారణ ప్రయాణికులకు ఈ స్టేషన్ అద్భుతమైన ప్రయాణ అనుభవాన్ని ఇవ్వబోతోంది. ఎప్పుడూ బిజీగా ఉండే ఈ స్టేషన్‌ను ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు భారీగా రీడెవలప్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం
Image Credit : X/kishanreddybjp

ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం

ఈ సరికొత్త అల్ట్రా-మోడ్రన్ రైల్వే స్టేషన్‌ను జూలై 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్' (ABSS) కింద ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) చీఫ్ పీఆర్ఓ ఎ. శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ స్టేషన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు దాదాపు రూ. 26 కోట్లు ఖర్చు చేశారు.

Related Articles

Related image1
Bonalu: గోల్కొండ కోటలోనే తొలి బోనం.. ఈ ఆషాఢం సంబురాల వెనుక అసలు స్టోరీ ఏంటో తెలుసా?
Related image2
South Kashmir of Andhra: దక్షిణ కాశ్మీరం.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే.. పాపికొండలు ఎందుకు అంత స్పెషల్?
36
ఏమేం మార్పులు వచ్చాయి? ఇక్కడ ఉన్న స్పెషల్స్ ఇవే
Image Credit : X/kishanreddybjp

ఏమేం మార్పులు వచ్చాయి? ఇక్కడ ఉన్న స్పెషల్స్ ఇవే

అసలు ఈ నయా స్టేషన్‌లో ఉన్న క్రేజీ ఫీచర్స్ ఏంటో తెలుసా? ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా ఇక్కడ 12 మీటర్ల వెడల్పైన సరికొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించారు. ఇప్పటిదాకా ఇక్కడ కేవలం 2 మీటర్ల బ్రిడ్జ్ మాత్రమే ఉండేది. అలాగే, గతంలో ఉన్న 2 లిఫ్టులకు అదనంగా మరో 2 కొత్త లిఫ్టులు, 2 ఎస్కలేటర్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇంతకుముందు ఇక్కడ సరైన వెయిటింగ్ ఏరియా లేదు, కానీ ఇప్పుడు అధునాతన వెయిటింగ్ హాల్, మోడ్రన్ టాయిలెట్లు, దివ్యాంగులకు ప్రత్యేక వసతులు కల్పించారు. స్టేషన్ బిల్డింగ్ ఫ్రంట్ లుక్, కొత్త ఎంట్రన్స్ పోర్టికోను ఎయిర్‌పోర్ట్ తరహాలో ఎంతో ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. సరికొత్త లైటింగ్, ల్యాండ్‌స్కేపింగ్‌తో పాటు ప్లాట్‌ఫామ్‌లపై అదనపు షెల్టర్లు, తాగునీరు, డ్రైనేజీ సౌకర్యాలను కూడా మెరుగుపరిచారు.

46
ఐటీ కారిడార్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్
Image Credit : X/kishanreddybjp

ఐటీ కారిడార్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్

లింగంపల్లి-సికింద్రాబాద్ మార్గంలో ఉండే ఈ హైటెక్ సిటీ స్టేషన్ ఐటీ కారిడార్ ప్రయాణికులకు ఒక లైఫ్ లైన్ లాంటిది. ఇక్కడి నుంచి ప్రతిరోజూ దాదాపు 62 ఎంఎంటిఎస్ రైళ్లు నడుస్తూ ప్రయాణికులను సికింద్రాబాద్, హైదరాబాద్, ఉందానగర్, ఫలక్‌నుమా, మేడ్చల్, ఘట్‌కేసర్ వంటి ఎన్నో కీలక ప్రాంతాలకు కనెక్ట్ చేస్తున్నాయి. ఐటీ కారిడార్ విస్తరిస్తుండటంతో రోజురోజుకూ ఇక్కడ రద్దీ పెరుగుతోంది. ప్రస్తుతం ఈ స్టేషన్ ద్వారా ప్రతిరోజూ సగటున 3,000 మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఆధునికీకరణ ప్రయాణికులకు పెద్ద ఉపశమనం కలిగించనుంది.

56
అమృత్ భారత్ స్కీమ్‌తో మారిన రూపురేఖలు.. మల్కాజ్‌గిరి డిమాండ్ కూడా
Image Credit : X/kishanreddybjp

అమృత్ భారత్ స్కీమ్‌తో మారిన రూపురేఖలు.. మల్కాజ్‌గిరి డిమాండ్ కూడా

తెలంగాణ మొత్తంలో దాదాపు రూ. 2,000 కోట్ల భారీ బడ్జెట్‌తో 40 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్కీమ్ కింద మోడ్రనైజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ పరిధిలో బేగంపేట తర్వాత పనులు పూర్తయిన రెండో ప్రధాన స్టేషన్‌గా మన హైటెక్ సిటీ నిలిచింది. గత 2025 సెప్టెంబర్‌లో అప్పటి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ స్టేషన్ పనులు 80 శాతం పూర్తయ్యాయని ప్రకటించిన సంగతి తెలిసిందే.

66
మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్
Image Credit : X/kishanreddybjp

మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్

ఈ స్టేషన్ ప్రారంభోత్సవ వార్త తెలియడంతో.. మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ పనులు కూడా పూర్తయ్యాయని, ప్రధాని కార్యక్రమంతో పాటే దానిని కూడా ప్రారంభించాలంటూ స్థానిక ప్రజలు, రైల్వే ప్రయాణికులు కోరుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: గోల్కొండ కోటలోనే తొలి బోనం.. ఈ ఆషాఢం సంబురాల వెనుక అసలు స్టోరీ ఏంటో తెలుసా?
Recommended image2
Weather Update: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు
Recommended image3
Now Playing
తెలంగాణలో భారీ పెట్టుబడులు అమెజాన్ డేటా సెంటర్ కు శంకుస్థాపన | Amazon Data Centre in Telangana
Related Stories
Recommended image1
Bonalu: గోల్కొండ కోటలోనే తొలి బోనం.. ఈ ఆషాఢం సంబురాల వెనుక అసలు స్టోరీ ఏంటో తెలుసా?
Recommended image2
South Kashmir of Andhra: దక్షిణ కాశ్మీరం.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే.. పాపికొండలు ఎందుకు అంత స్పెషల్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved