కరోనా టీకాకు రెడీ.. కానీ, మోడీ చెప్పారనే: కేటీఆర్ వ్యాఖ్యలు
కరోనా టీకాలు చాలా సురక్షితమైనవని, వాటిని వేయించుకునే విషయంలో అపోహలు, అనుమానాలు వద్దన్నారు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ . శనివారం తిలక్నగర్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకాల కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
కరోనా టీకాలు చాలా సురక్షితమైనవని, వాటిని వేయించుకునే విషయంలో అపోహలు, అనుమానాలు వద్దన్నారు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ . శనివారం తిలక్నగర్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకాల కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కొవిడ్ టీకా వేయించుకునేందుకు ప్రజా ప్రతినిధులంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ సూచన మేరకే ముందుగా టీకా వేయించుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.
కొవిడ్ ఫ్రంట్లైన్ వారియర్స్కు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులంతా కూడా త్వరలో టీకా వేయించుకుంటారని మంత్రి తెలిపారు.
భారత దేశ పరిస్థితులకు అనుగుణంగా టీకా తయారీ జరిగిందని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత్ బయోటెక్ కూడా తయారు చేసిందని, టీకా తయారీ దారుల్లో మన రాష్ట్రానికి చెందిన సంస్థ ఉండటం గర్వకారణమన్నారు.
మెడికల్ హబ్గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకత్వంలో అందరికీ టీకా అందుతుందని మంత్రి చెప్పారు. కరోనా మహమ్మారికి ముగింపు ప్రారంభమైందని, అందరూ సుఖ సంతోషాలతో ఉండే రోజులు వస్తాయని ఆశిస్తున్నామని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, కలెక్టర్ శ్వేతా మహంతి, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.