పారిశుద్ధ్య కార్మికుడిగా మారిన మంత్రి హరీష్ రావు..
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పారిశుద్ధ్య కార్మికుడి అవతారం ఎత్తారు. సిద్దిపేటలో తడి, పొడి వ్యర్ధాలను వేరు చేసే కేంద్రం, ప్లాస్టిక్ పున:సంవిధాన కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు మంగళవారం ప్రారంభించారు.
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పారిశుద్ధ్య కార్మికుడి అవతారం ఎత్తారు.
సిద్దిపేటలో తడి, పొడి వ్యర్ధాలను వేరు చేసే కేంద్రం, ప్లాస్టిక్ పున:సంవిధాన కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు పారిశుధ్య కార్మికులు ధరించే యూనిఫాంను ధరించారు. తడి, పొడి చెత్తను మిషన్ లో వేసి మున్సిపల్ కార్మికులకు స్పూర్తిగా నిలిచారు. మంత్రి చేసిన ఈ పనికి పారిశుద్ధ్య కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
అపరిశుభ్రమైన వాతావరణాన్ని ఆహ్లాదకరమైన వాతావరణంగా చేయడం, వ్యర్థ పదార్థాలతో కూడా ఉపయోగకరమైన వస్తువులు తయారు చేయొచ్చని మంత్రి హరీష్ రావు తెలిపారు.